E-Paper
Advertisement

Central Bank of India: రూ.లక్షల జీతంతో ఉద్యోగాలు.. క్వాలిఫికేషన్ ఇదే

Central Bank of India: రూ.లక్షల జీతంతో ఉద్యోగాలు.. క్వాలిఫికేషన్ ఇదే

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 275 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్, డేటా సైంటిస్ట్, ఐటీ ఆఫీసర్ వంటి కీలక పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోండి.

నోట్: దరఖాస్తుకు మూడు రోజులే గడువు

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 275

పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 రకాల స్పెషలిస్ట్ ఉద్యోగాలను బ్యాంక్ భర్తీ చేస్తోంది. వీటిలో సాఫ్ట్‌వేర్ డెవలపర్ (జావా, డాట్ నెట్) పోస్టులు 19 ఉన్నాయి. మొబైల్ డెవలపర్ 3, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ 11, డిజిటల్ ఛానల్ మేనేజర్ 23 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విభాగంలో అత్యధికంగా 38 పోస్టులు ఉన్నాయి. ఐటీ ఆఫీసర్ విభాగంలో 82 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ మేనేజర్, రిస్క్ మేనేజర్ లాంటి ఇతర విభాగాల్లోనూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎంసీఏ పూర్తి చేసిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలతో పాటు సంబంధిత విభాగంలో ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. వయోపరిమితిని పరిశీలిస్తే.. స్కేల్-IV పోస్టులకు 45 ఏళ్లు మించరాదు. స్కేల్-I ఉద్యోగాలకు 30 ఏళ్లు గరిష్ట పరిమితిగా నిర్ణయించారు.

జీతం: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జీతాలను చెల్లిస్తుంది. స్కేల్-IV ఉద్యోగులకు నెలకు గరిష్టంగా రూ.1,20,940 వరకు జీతం లభిస్తుంది. స్కేల్-III అభ్యర్థులకు రూ.1,05,280 వరకు చెల్లిస్తారు. స్కేల్-II పోస్టులకు రూ.93,960 వరకు అలాగే స్కేల్-I పోస్టులకు రూ.85,920 వరకు వేతనం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ రాత పరీక్ష కీలకం కానుంది. దీనిలో మెరిట్ సాధించిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు:  జనరల్ అభ్యర్థులు రూ.850 ప్లస్ జీఎస్‌టీ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175 ప్లస్ జీఎస్‌టీగా నిర్ణయించారు.

ఎగ్జామ్ సెంటర్స్: తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థుల సౌకర్యార్థం హైదరాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ముఖ్యమైన తేదీలు:  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 28న ప్రారంభమై మార్చి 23వ తేదీతో ముగియనుంది. పరీక్షను ఏప్రిల్ 2026లో నిర్వహించే అవకాశం ఉంది.

దరఖాస్తుకు ప్రారంభ తేది: ఫిబ్రవరి 28

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 23

ఎగ్జామ్: వచ్చే నెలలో ఉండే అవకాశం ఉంది..

అఫీషియల్ వెబ్ సైట్: https://centralbank.bank.in/

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×