E-Paper
Advertisement

పాఠశాలల విద్యార్థులకు కలిసొచ్చింది.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగింపు, రీఓపెన్ ఎప్పుడంటే..

పాఠశాలల విద్యార్థులకు కలిసొచ్చింది.. తెలంగాణలో  సమ్మర్ హాలిడేస్ పొడిగింపు, రీఓపెన్ ఎప్పుడంటే..

Telangana Schools Reopen: తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు శుభవార్త చెప్పేసింది ప్రభుత్వం. ఎండలు నేపథ్యంలో స్కూల్స్ రీఓపెన్ వాయిదా వేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది తెలంగాణ విద్యాశాఖ. దీంతో విద్యార్థుల్లో ఒక్కటే ఆనందం. ఈ విధంగా తమకు ఎప్పుడూ సెలవులు రాలేదని, సూర్యదేవుని పుణ్యమాని వచ్చాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగింపు

తెలంగాణలో పాఠశాలల రీఓపెనింగ్ విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పునఃప్రారంభం తేదీని మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం తొలుతన జూన్ 12న పాఠశాలలు తెరవాల్సి ఉంది. దాన్ని సవరిస్తూ జూన్ 15న పాఠశాలలను ఓపెన్ చేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

పాఠశాలలు రీ ఓపెన్ ఆలస్యం విషయం తెలియగానే విద్యార్థులు ఒక్కటే ఆనందం. స్కూల్స్ ఓపెన్ అయ్యేనాటికి వర్షాలు మొదలు కానుండడంతో ఎండల తీవ్రత తగ్గవచ్చని విద్యాశాఖ అంచనా వేసింది. సెలవులు పొడిగింపుకు కారణాలు వెల్లడించారు అధికారులు.

జూన్ 15న పాఠశాలలు రీఓపెన్, వెల్లడించిన విద్యాశాఖ

జూన్ 12న పాఠశాలలు తెరిచిన వెంటనే మరుసటి రోజు అంటే జూన్ 13న రెండో శనివారం, జూన్ 14న ఆదివారం రావడంతో వారాంతపు సెలవులు వచ్చాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. విద్యార్థులు-టీచర్ల సౌకర్యార్థం జూన్ 12న సెలవుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రీ ఓపెనింగ్ తేదీని జూన్ 15కి మారింది.

అదే సమయంలో మరొక నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. ఈ మార్పు వల్ల విద్యా సంవత్సరంలో వర్కింగ్ డేస్ నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయాలు చేపట్టింది. జూన్ 12 సెలవును బదులుగా.. జులై 11న రెండో శనివారం పాఠశాలలు యథావిధిగా తెరిచి ఉంటుంది. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటనలో స్పష్టం చేశారు.

ALSO READ: జేఈఈ అడ్వాన్స్‌డ్-2026, డేటా లీక్ కాలేదన్న ఐఐటీ రూర్కీ

Related News

JEE Advance-2026 Data Breach: జేఈఈ అడ్వాన్స్‌డ్-2026, డేటా లీక్ కాలేదన్న ఐఐటీ రూర్కీ

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

Big Stories

×