E-Paper
Advertisement

Essential prices : పెరిగిన నిత్యావసర ధరలు.. నోటికి అందని రుచి..

Essential prices : పెరిగిన నిత్యావసర ధరలు.. నోటికి అందని రుచి..

Essential prices : నిత్యావసర వస్తువుల ధరలు నింగిని అంటుతున్నాయి. కూరగాయల ధరలు కొనేలా లేవు. నోటికి రుచిగా.. కడుపునిండా భోజనం చేయడం సాటి మధ్యతరగతి కుటుంబానికి కలే అయ్యేలా ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు చూస్తే.. మీక్కూడా ఇలాగే అనిపిస్తుంది. వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాలు పంటల దిగుబడిని తగ్గించాయి. చేతికి పంట అందివచ్చే సమయంలో.. పంటలు వర్షార్పణమయ్యాయి. దాంతో కూరగాయలతో పాటు ఇతర నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి.

బియ్యం ధరలు రోజుకొకలా పెరుగుతున్నాయి. నవంబర్ లో సోనామసూరి బియ్యం కిలో రూ.65 ఉండేది. డిసెంబర్ నాటికి కిలో రూ.75 అయ్యింది. జనవరి లో కిలో రూ.80 కి పెరిగింది. ప్యాకింగ్ , రవాణా ఛార్జీలతో క్వింటా బస్తా బియ్యం ధర రూ.6500 నుంచి రూ.7000 వరకు పలుకుతుంది. రిటైల్ షాపుల్లో రూ.75 నుంచి రూ.80 వరకూ ఉంది. విజయ మసూరి బియ్యం క్వింటా బస్తా ధర రూ.5900 నుంచి రూ.6300 వరకూ పలుకుతోంది.

కూరగాయలు ధరల విషయనికి వస్తే కిలో రూ.80కి పైగా ఉన్నాయి. పండగలు, వేడుకలు,పెళ్లిళ్లు ఉండటంతో నాన్ వెజ్ ధరలు కూడా బాగా పెరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా నగరంలో 5 లక్షల కిలోల చికెన్ అమ్ముడు పోయింది. లైవ్ కోడి ధర రూ.140 ఉండగా.. స్కిన్ లెస్ చికెన్ ధర రూ.240 కి చేరింది. మటన్ కిలో రూ.820 ఉంది. బోన్ లెస్ మటన్ కిలో రూ.1020 అయ్యింది. కోడిగుడ్ల ధరలు డజన్ రూ.75 నుంచి రూ.80 వరకు ఉన్నాయి. నిత్యవసర వస్తువుల ధరలు ఇలా పెరుగుతూ ఉంటే.. ఇంకేం తినాలని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×