BigTV English
Advertisement

YSRTP Merged in Congress: కాంగ్రెస్ లో YSRTP విలీనం.. హస్తం గూటికి షర్మిల

YSRTP Merged in Congress: కాంగ్రెస్ లో YSRTP విలీనం.. హస్తం గూటికి షర్మిల
YSRTP Merged in Congress

YSRTP Merged in Congress(Morning news today telugu):

ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. హస్తం అగ్రనేతలైన సోనియా, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ సమక్షంలో ఆమె హస్తం కండువా కప్పుకున్నారు. మల్లికార్జున ఖర్గే షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్సార్టీపీని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేశారు.


తెలంగాణ ఎన్నికల నాటి నుంచి షర్మిల పార్టీ విలీనంపై ఉత్కంఠ కొనసాగింది. అప్పట్లో చర్చలు కుదరకపోవడంతో షర్మిల సైలెంట్‌ అయ్యారు. అయితే,.. వైఎస్‌ఆర్‌ బిడ్డ కావడంతో ఏపీలో ఆమెను దించితే పార్టీ బలోపేతం అవుతుందన్న ప్రచారం అప్పట్లోనే సాగింది. అంతా ఊహించినట్టే చివరికి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తూ.. తన సొంత అన్న అయిన వైసీసీ అధినేత సీఎం జగన్‌పై పొలిటికల్‌ యుద్ధం చేయడానికి షర్మిల సిద్ధమైంది.

కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అన్నారు. వైఎస్సార్ జీవితమంతా కాంగ్రెస్ లోనే ఉన్నారని, రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిని చేయడం తన తండ్రి కల అని చెప్పిన షర్మిల.. తండ్రి వైఎస్సార్ అడుగుజాడల్లోనే తాను నడుస్తున్నట్లు చెప్పారు. ఇకపై వైఎస్సార్టీపీ లేదని.. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశామని షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్ తనకు ఏ బాధ్యతను అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానని షర్మిల తెలిపారు.


Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×