E-Paper
Advertisement

Mumbai Boat Accident : పర్యాటకుల ఫెర్రీని ఢీకొట్టిన నేవీ స్పీడ్ బోట్.. సముద్రంలో పడిపోయిన 110 మంది ప్రయాణికులు

Mumbai Boat Accident : పర్యాటకుల ఫెర్రీని ఢీకొట్టిన నేవీ స్పీడ్ బోట్.. సముద్రంలో పడిపోయిన 110 మంది ప్రయాణికులు

Mumbai Boat Accident : ముంబయి సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదా గా సముద్రంలో పర్యాటకులతో విహారానికి వెళ్లిన ఓ ఫెర్రీని భారత నేవీకి చెందిన స్పీడ్ బోట్ ఢీ కొట్టడంతో.. ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ప్రమాద విషయం తెలియడంతో.. మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు నేవీ అధికారులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు.

ముంబయిలోని ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ నుంచి ఎలిఫెంటా గుహలకు నీల్‌కమల్‌ అనే ఫెర్రీ.. దాదాపు 100 మందికి పైగా పర్యటకులతో బయలుదేరింది. బంగాళా ఖాతంలోని ఈ ఫెర్రీ ప్రయాణిస్తుండగా..సాయంత్రం 4 గంటల సమయంలో నేవీ స్పీట్ బోట్ ఢీ కొట్టింది. సముద్ర తీరంలో గస్తీ తిరిగే భారత నేవీ బోట్లు నిత్యం ఇక్కడ పహారా కాస్తుంటాయి. వాటిలో ఒకటి.. వేగంగా వచ్చి ప్రయాణికుల బోట్ ను ఢీ కొట్టింది. దాంతో.. ఫెర్రీ తీవ్రంగా దెబ్బతినడంతో, సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా.. 101 మందిని సహాయక బృందాలు కాపాడాయి.  అయితే.. ఈ ఘటన సమయంలో ఫెర్రీతో పాటు నేవీ బోటులో ఎంత మంది ఉన్నారనే విషయంపై స్పష్టత లేదు.

ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు భారీ ఆపరేషన్‌ చేపట్టాయి. 11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు, నాలుగు హెలికాప్టర్లు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. పోర్టు అధికారులు, కోస్ట్‌గార్డ్‌, మత్స్యకారులు సహాయక చర్యల్లో పాల్గొని 101 మంది ప్రయాణికుల్ని, నేవీ సిబ్బందిని కాపాడి.. ఒడ్డుకు చేర్చారు.

ప్రమాద ఘటనపై స్పందించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనలో 13 మంది మృత దేహాల్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన సీఎం.. మృతుల్లో 10 మంది పర్యటకులు, ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నట్లు ప్రకటించారు.

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్రమాదానికి కారణమైన బోటు.. నేవీదా లేక కోస్టు గార్డుకు చెందినదా అనేది తెలియాల్సి ఉందని, స్పీడుపై నియంత్ర‌ణ త‌ప్ప‌డంతో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు భావిస్తున్నట్లు తెలిపారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×