BigTV English
Advertisement

Vizag News: వైజాగ్ వాసుల ఆ కష్టాలకు చెల్లు.. కేంద్రానికి థ్యాంక్స్ చెప్పిన పవన్..

Vizag News: వైజాగ్ వాసుల ఆ కష్టాలకు చెల్లు.. కేంద్రానికి థ్యాంక్స్ చెప్పిన పవన్..

Vizag News: వైజాగ్ వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా వైజాగ్ వాసుల ఎదురు చూపులకు నేటి ప్రకటనతో తెరపడింది. విశాఖపట్నం జిల్లాలోని NH-516Cలో అనకాపల్లి – ఆనందపురం NH-16 కారిడార్‌ను షీలానగర్ జంక్షన్‌కు కలుపుతూ రహదారిని అభివృద్ది చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ప్రకటన విడుదల చేశారు.


విశాఖపట్నం జిల్లాలోని NH-516Cలో అనకాపల్లి – ఆనందపురం NH-16 కారిడార్‌ ఉంది. ఈ రహదారిలో నిరంతరం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే దగ్గరలోని షీలానగర్ జంక్షన్‌కు 6 లైన్ల రహదారిని విస్తృత పరచాలని ఎప్పటి నుండో డిమాండ్ వినిపిస్తోంది. ఈ రహదారిని అభివృద్ది పరచడం ద్వార, వైజాగ్ పోర్టుకు వెళ్లే వాహనాలు అతి త్వరగా తమ గమ్యానికి చేరుకుంటాయి. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం, కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీనితో తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ప్రకటన జారీ చేశారు.

విశాఖపట్నం పరిధిలోని అనకాపల్లి – ఆనందపురం NH-16 కారిడార్‌ను షీలానగర్ జంక్షన్‌కు కలుపుతూ 6 లైన్ల హైవే నిర్మాణం కోసం ₹963.93 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. 12.66 కి.మీ విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ సబ్బవరం గ్రామానికి తూర్పు వైపున ప్రారంభమై షీలానగర్ జంక్షన్‌లోని ప్రస్తుత పోర్టు రోడ్డులో గెయిల్ కార్యాలయం దగ్గర ముగుస్తుందన్నారు. ఈ రహదారి అభివృద్ది చేయడం ద్వార, ట్రాఫిక్ అంతరాయాలను అధిగమించడం సాధ్యమవుతుందన్నారు. షీలానగర్ – ఆనందపురం ట్రాఫిక్‌ను వేరు చేయడం ద్వారా విశాఖపట్నం పోర్టుకు కనెక్టివిటీ గణనీయంగా పెంచుతుందని గడ్కరి అన్నారు.


Also Read: Indian Navy Rehearsal: విశాఖ నేవీ రిహార్సల్స్‌‌‌‌‌‌‌లో అపశృతి.. సముద్రంలో దిగిన కమెండో, ఆ తర్వాత..

ఈ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి గడ్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పీఎం నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబుల దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, ఏపీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ విశేషమైన పురోగతిని సాధిస్తోందని పవన్ అభిప్రాయపడ్డారు. తాజాగా రహదారిని విస్తరించడం ద్వార, వైజాగ్ వాసుల కల నెరవేరిందని పవన్ ట్వీట్ చేశారు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×