E-Paper
Advertisement

Beauty Tips For Face: ముఖంపై మచ్చలు ఎంతకీ పోవడం లేదా? అయితే ఇలా చెక్ పెట్టండి

Beauty Tips For Face: ముఖంపై మచ్చలు ఎంతకీ పోవడం లేదా? అయితే ఇలా చెక్ పెట్టండి
Advertisement

Beauty Tips For Face: ముఖం అందంగా, ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రాబ్లమ్స్‌ను ఫేస్ చేస్తున్నారు. దీనికి పొల్యూషన్, ఒత్తిడి, జంక్ ఫుడ్స్ తినడం వల్ల చర్మ ఈ సమస్యలు వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా ఉండాలంటే.. రెగ్యులర్‌గా స్కిన్‌కేర్ రొటీన్ ఫాలో అవ్వాల్సిందే.

అలా అని బయట మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్, వేలకు వేలు ఖర్చు చేసి కొనకండి. అవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంట్లోనే దొరికే నాచురల్ పదార్ధాలతో ఫేస్ మాస్క్‌లు ట్రై చేశారంటే మంచి ఫలితం ఉంటుంది. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముఖం కాంతివంతంగా అందంగా కనిపిస్తుంది. ఈ టిప్స్ ఫాలో అవ్వారంటే.. ముఖారవిందం మీకే కనువిందు చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కావాల్సిన పదార్ధాలు..
పసుపు
తేనె
చిన్న టమాటా
టీ స్పూన్ నిమ్మరసం
కొబ్బరి నూనె

తయారు చేసుకునే విధానం..
ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ పసుపు, టీ స్పూన్ తేనె, నిమ్మరసం, టమోటా గుజ్జు, కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. పది నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రెండు రోజులకు ఒకసారి ట్రై చేయండి. క్రమంగా ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోయి కాంతి వంతంగా మెరుస్తుంది.

Advertisement

స్కిన్ గ్లో, మచ్చలు తొలగిపోవడం కోసం మరొక చిట్కా..

కావాల్సిన పదార్ధాలు..
అలోవెరా జెల్
కలబంద
రోజ్ వాటర్
విటమిన్ ఇ క్యాప్సూల్స్

తయారు చేసే విధానం..

ఒక చిన్న బౌల్‌లో నాలుగు విటమిన్ ఇ క్యాప్సూల్స్ వేసి అందులో అలోవెరా జెల్, టీ స్పూన్ రోజ్ వాటర్, కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అప్లై చేసి.. అరగంట తర్వాత ఫేష్ వాష్ చేసుకోండి. ఇలా రోజూ చేస్తే.. మీ ముఖం మిలమిల మెరిసిపోతుంది. చాలా అందంగా కనపిస్తారు.

Also Read: ఒక్కసారి ఈ హెన్నా అప్లై చేశారంటే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు కాస్త నల్లగా మారుతుంది

బియ్యం పిండి, తేనె, రోజ్ వాటర్‌తో ఫేస్ మాస్క్
ముఖం కాంతివంతంగా, మచ్చలు లేకుండా చేసేందుకు ఈ ఫేస్ మాస్క్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ బియ్యంపిండి, టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలిపి బాగా కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

Big Stories

Advertisement
×