BigTV English

Rice Flour For Skin: బియ్యం పిండిని ఇలా కూడా.. వాడొచ్చు తెలుసా ?

Rice Flour For Skin: బియ్యం పిండిని ఇలా కూడా.. వాడొచ్చు తెలుసా ?

Rice Flour For Skin: నేటి బిజీ జీవితంలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కొంచెం కష్టం అనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, మచ్చలేని, మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. దీని కోసం వివిధ రకాల స్కిన్ కేర్ టిప్స్ పాటిస్తారు. ముఖాన్ని ప్రకాశవంతంగా, అందంగా మార్చడానికి మార్కెట్లో అనేక రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వీటికి బదులుగా హోం రెమెడీస్ ఉపయోగించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.


మచ్చలేని , ప్రకాశవంతమైన చర్మం కోసం హోం రెమెడీస్ బాగా పనిచేస్తాయి. ఇంట్లో తయారుచేసిన హోం రెమెడీస్ లో ఎటువంటి రసాయనాలు ఉండవు. దీని కారణంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇదిలా ఉంటే బియ్యం పిండి చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని అందంగా మార్చడంలో కూడా ఉపయోగపడుతుంది.

బియ్యం పిండి చర్మ సౌందర్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు మన చర్మానికి తగిన పోషణను అందిస్తాయి. ఇది మన చర్మాన్ని ఎక్స్‌ ఫోలియేట్ చేస్తుంది . అంతే కాకుండా ఇందులో ఉండే అలంటోయిన్ , ఫెరులిక్ యాసిడ్ కూడా సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి.


తేనె, బియ్యం పిండి :
ఆయుర్వేదంలో తేనెకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక సహజ యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఆక్సిడెంట్. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి దీనిని ఉపయోగించాలి. ఇది మన చర్మ రంధ్రాలను లోతుగా శుభ్ర పరుస్తుంది. ముఖాన్ని కూడా తేమగా చేస్తుంది. తేనెను బియ్యం పిండిలో కలిపి చర్మంపై అప్లై చేయడం వల్ల ముఖ కాంతి పెరుగుతుంది. మచ్చలు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతాయి.

ఫేస్ ప్యాక్ తయారీ:
ఒక టీస్పూన్ తేనెను రెండు టీస్పూన్ల బియ్యం పిండితో కలపండి. మీరు దీనికి కొద్దిగా రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్‌ని చేతుల సహాయంతో ముఖంపై బాగా అప్లై చేసి 15 నిమిషాలు ఆరబెట్టిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. వారానికి రెండుసార్లు ఉపయోగించడం ద్వారా మీరు చాలా మంచి ఫలితాలను చూస్తారు.

పసుపు, బియ్యం పిండి ఫేస్ ప్యాక్:
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఏ రకమైన చర్మ ఇన్ఫెక్షన్ లేదా మొటిమలు పెరగకుండా నిరోధిస్తుంది. పసుపు చర్మంపై టానింగ్ తగ్గించడంలో , చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో కూడా చాలా సహాయపడుతుంది. ఇందులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పసుపు సహజ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పసుపును బియ్యం పిండిలో కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ రంగు మెరుగుపడుతుంది.

ఎలా వాడాలి ?
అర టీస్పూన్ పసుపు పొడిని రెండు టీస్పూన్ల బియ్యం పిండితో కలపండి. అనంతరం పాలు లేదా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ సిద్ధం చేయండి. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి 15 నుండి 20 నిమిషాలు ఆరనివ్వండి. అది ఆరిన తర్వాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ ఫేస్ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల చర్మానికి లోతైన పోషణ లభిస్తుంది. అంతే కాకుండా మీ చర్మం మెరుస్తుంది.

పెరుగు, బియ్యం పిండి:
పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మం నుండి మృతకణాలను తొలగించి ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది. పెరుగు మచ్చలను, పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ముఖాన్ని చాలా మృదువుగా చేస్తుంది. పెరుగును బియ్యం పిండిలో కలిపి రాసుకుంటే చర్మం పొడిబారే సమస్య తొలగిపోతుంది. చర్మం చాలా మృదువుగా, మెరుస్తూ మారుతుంది.

Also Read: ఈ నేచురల్ హెయిర్ కలర్‌తో తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా !

ఎలా వాడాలి ?
ఒక చెంచా పెరుగును రెండు చెంచాల బియ్యం పిండితో కలపండి. మంచి పేస్ట్ చేయడానికి మీరు దానికి రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచండి. అది ఆరిన తర్వాత, గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఈ రెమెడీని వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోయి ముఖంపై సహజమైన మెరుపు వస్తుంది.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×