E-Paper
Advertisement

Migraine: ఈ 3 అలవాట్లు మార్చుకుంటే.. చాలు, మైగ్రేన్ రమ్మన్నా రాదు

Migraine: ఈ 3 అలవాట్లు మార్చుకుంటే.. చాలు, మైగ్రేన్ రమ్మన్నా రాదు

Migraine: మైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి. ఈ రోజుల్లో నాడీ సంబంధిత సమస్యల బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. సాధారణ తలనొప్పికి , మైగ్రేన్‌కి మధ్య తేడాను గుర్తించడం చాలా సులభం . మైగ్రేన్ తలలో ఒక సగ భాగాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

మైగ్రేన్ సమయంలో నొప్పి తేలికపాటి నుండి తీవ్రం అవడానికి ఎక్కువ సమయం పట్టదు. మైగ్రేన్ బారిన పడిన వ్యక్తి పెద్ద శబ్దాలు, ప్రకాశవంతమైన కాంతి, బలమైన లేదా తేలిక పాటి వాసనను తట్టుకోలేరు. తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడినప్పుడు బాధితులు కొన్ని సార్లు వాంతులు, ముఖ ఎముకలలో నొప్పి, ముక్కు చుట్టూ తీవ్ర అసౌకర్యాన్ని అనుభవిస్తారు. దీని బారిన పడిన వ్యక్తి కొంత సమయం చీకటి ప్రదేశంలో ఉండాలని సలహా ఇస్తారు. ఈ విధంగా మైగ్రేన్ నొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

మైగ్రేన్ నొప్పి పెరగడానికి గల కారణాలు:

లైఫ్ స్టైల్:
మన బిజీ లైఫ్ స్టైల్ కారణంగా.. మనం మన ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ చూపడం లేదు. తప్పుడు జీవనశైలిని అవలంబించడం వల్ల కలిగే అనేక నష్టాలలో మైగ్రేన్ కూడా ఒకటి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం లేదా తెల్లవారుజాము వరకు నిద్రపోవడం కూడా మైగ్రేన్ నొప్పికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. మనం నిద్రకు చాలా తక్కువ ప్రాముఖ్యత ఇస్తాము. ఇది మన అతిపెద్ద తప్పు. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల.. మైగ్రేన్ నొప్పి పెరుగుతుంది. అందుకే సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్ర లేకపోవడం వల్ల.. మైగ్రేన్‌తో పాటు, కంటి సమస్యలు, సోమరితనం, అలసటగా అనిపించడం, ఏ పనిపైనా ఆసక్తి చేయకపోడం వంటి అనేక సమస్యలు మొదలవుతాయి.

ఆరోగ్యకరమైన ఆహారం:
ఆహారం పట్ల శ్రద్ధ చూపకపోవడం వల్ల కూడా మైగ్రేన్ మొదలవుతుంది. ప్రారంభంలో మనం దీనిని ఒక సాధారణ లక్షణంగా అనుకుని లైట్ తీసుకుంటాము. నెమ్మదిగా.. అది పెరగడం ప్రారంభించినప్పుడు.. సమస్య ఉందని గ్రహిస్తాం. అందుకే మీరు తినే ఆహారం, డ్రింక్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహించండి. తక్కువ నూనె , సుగంధ ద్రవ్యాలతో , పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి. ఆహారంలో పోషకాహార లోపం వల్ల మైగ్రేన్ రాకుండా ఉండటానికి మీరు ఒకేసారి తీసుకునే భోజనంలో అన్ని రకాల పోషకాలను చేర్చడానికి ప్రయత్నించండి.

Also Read: షాంపూ లేకుండానే.. వీటితో హెయిర్ వాష్ చేసుకోవచ్చు తెలుసా ?

స్క్రీన్ టైం:

ఇంటి పని లేదా ఆఫీసు పని అలసట నుండి బయటపడటానికి.. రాత్రి పడుకునే ముందు మనం మొబైల్ ఫోన్‌లతో ఎక్కువ సమయం గడుపుతాము. దీని కారణంగా మైగ్రేన్ సమస్య పెరగడం ప్రారంభమవుతుంది. ఈ విధంగా మనం నిద్రపోయే ముందు ఎక్కువసేపు స్క్రీన్ ముందు ఉంటాము. ఇది మైగ్రేన్‌కు కారణమవుతుంది. అంతే కాకుండా తీవ్రంగా నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది మన మానసిక ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. శారీరక ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి , మైగ్రేన్ నుండి దూరంగా ఉండటానికి. నిద్రపోయే రెండు గంటల ముందు టీవీ, మొబైల్, ల్యాప్‌ టాప్ మొదలైన వాటిని చూడటం మానేయండి. దీన్ని అలవాటుగా చేసుకోండి. ఈ విధంగా స్క్రీన్ సమయం వల్ల కలిగే మీ మైగ్రేన్ నొప్పి పూర్తిగా ఆగిపోతుంది.

Related News

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

Big Stories

×