E-Paper
Advertisement

Bandla Ganesh Padayatra:షాద్ నగర్ నుంచి తిరుమల వరకు పాదయాత్ర.. సీఎం కోసం బండ్ల గణేష్ ఎంత పని చేస్తున్నాడు?

Bandla Ganesh Padayatra:షాద్ నగర్ నుంచి తిరుమల వరకు పాదయాత్ర.. సీఎం కోసం బండ్ల గణేష్ ఎంత పని చేస్తున్నాడు?
Advertisement

Bandla Ganesh Padayatra: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ (Bandla Ganesh)అనంతరం నిర్మాతగా మారి టాలీవుడ్ స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా నిర్మాతగా పలు సినిమాలను నిర్మించిన ఈయన మంచి సక్సెస్ అయినప్పటికీ ఇండస్ట్రీకి కొన్ని కారణాలవల్ల దూరం అయ్యారు. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బండ్ల గణేష్ ఇటీవల మరో కొత్త నిర్మాణ సంస్థను ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుందని తెలుస్తుంది.

తిరుమలకు పాదయాత్ర ..

ఇక బండ్ల గణేష్ సినిమాలలో నటించకపోయిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.. అలాగే రాజకీయాల గురించి కూడా ఈయన ప్రస్తావిస్తూ నిత్యం సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు. తాజాగా బండ్ల గణేష్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బండ్ల గణేష్ జనవరి 19వ తేదీ నుంచి పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈయన పాదయాత్ర ప్రారంభించారంటే రాజకీయాలలో భాగంగా కాదని తెలుస్తుంది.

చంద్రబాబు కోసం పాదయాత్ర…

Advertisement

ఈనెల 19వ తేదీ షాద్ నగర్ నుంచి బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర ప్రారంభించడానికి కారణం లేకపోలేదు గతంలో స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్(Chandrababu Naidu Arrest) అయిన సంగతి తెలిసిందే .అయితే ఆయన పై ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా బయటకు వస్తే పాదయాత్ర ద్వారా తిరుమల చేరుకొని స్వామి వారిని దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నట్లు తెలుస్తోంది అయితే ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు బయటపడటంతో ఈయన తన మొక్కులు చెల్లించుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

500 కిలోమీటర్లు పాదయాత్ర..

Advertisement

ఈనెల 19వ తేదీ షాద్ నగర్ లోని తన ఇంటి నుంచి ఈ పాదయాత్ర మొదలుకానుంది. ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని భారీ ఎత్తున ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. కాలినడకనే స్వామి వారిని బండ్ల గణేష్ దర్శించుకోబోతున్నారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. షాద్ నగర్ నుంచి తిరుమల అంటే సుమారు 500 కిలోమీటర్లు పైగా ఉంటుందని, ఇంత దూరం బండ్ల గణేష్ పాదయాత్ర చేస్తున్నారంటే ఆయనకు చంద్రబాబు నాయుడు అంటే ఎంత గౌరవం, అభిమానం ఉందో స్పష్టం అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: The Raja Saab: అప్పుడే డిసైడ్ అవ్వొద్దు… రాజాసాబ్‌పై మారుతి హోప్స్

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×