ఒడిశాలోని రూర్కెలాలో చార్టర్డ్ విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో చార్టర్డ్ విమానంలో తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ అయిన 10కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో పైలట్ తో సహా తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. చార్టర్డ్ విమానం భువనేశ్వర్కు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ALSO READ: Bird Saliva Soup: ఈ పక్షి ఉమ్ము ఖరీదు రూ.10 లక్షలకు పైనే.. లొట్టలేసుకుని మరీ తింటున్నారు!