E-Paper
Advertisement

Chiranjeevi: రతన్ టాటాను గుర్తు చేస్తున్నారు.. ఆనంద్ మహేంద్ర పై చిరు ట్వీట్!

Chiranjeevi: రతన్ టాటాను గుర్తు చేస్తున్నారు.. ఆనంద్ మహేంద్ర పై చిరు ట్వీట్!
Advertisement

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖ వ్యాపారవేత్త మహేంద్ర గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర(Anand Mahindra) పై ప్రశంసలు కురిపిస్తూ ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇటీవల వీరిద్దరూ తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం చిరంజీవి ఆనంద్ మహేంద్రతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆనంద్ మహేంద్ర పై ప్రశంసలు కురిపించారు.

రతన్ టాటా గారు గుర్తొస్తారు..

ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేస్తూ.. డియర్ ఆనంద్ మహేంద్ర.. మీరు ఎంతో వినయంతో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం కలవారు. మీరు ఎంతో మందికి ఆదర్శనీయం. మీరు ఎన్నో విషయాలలో రతన్ టాటా గారిని గుర్తు చేస్తున్నారు. రతన్ టాటా గారు తన విలువలతో గొప్ప వ్యక్తిగా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. మీరు కూడా అచ్చం రతన్ టాటా (Ratan Tata)గారిలాగే అనిపిస్తారని, సేవా కార్యక్రమాల పట్ల మీరు చూపిస్తున్నటువంటి నిబద్ధత ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తన సంతోషాన్ని తెలియజేయడమే కాకుండా ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ..

Advertisement

ఇక ఆనంద్ మహేంద్ర ప్రముఖ వ్యాపారవేత్తగా మంచి సక్సెస్ అందుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడమే కాకుండా తనదైన శైలిలోనే అందరికీ సహాయ సహకారాలను అందిస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఆయన గురించి ఎంతో గొప్పగా చెబుతూ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇక చిరంజీవితో పాటు మరికొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

Advertisement

చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే . ఈయన ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని జనవరి 12వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదల చేయబోతున్న నేపథ్యంలో షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే .ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి . ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే . ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన మీసాల పిల్ల సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమా పట్ల భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

Also Read: Annagaru Vostaru: అన్నగారు వస్తారు మూవీకి బిగ్ షాక్… రిలీజ్ వద్దు అంటూ హై కోర్టు స్టే

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×