E-Paper
Advertisement

పెళ్లి కంటే కుక్కను పెంచుకోవడం బెటర్….టాలీవుడ్ బ్యూటీ బోల్డ్ స్టేట్‌మెంట్!

పెళ్లి కంటే కుక్కను పెంచుకోవడం బెటర్….టాలీవుడ్ బ్యూటీ బోల్డ్ స్టేట్‌మెంట్!
Advertisement

Swathi Comments : స్వాతి… ఈ పేరు వింటే ఎవరా అనే ఆలోచనలో పడతారేమో కాని కలర్స్ స్వాతి అనగానే గుర్తు పట్టని మూవీ లవర్ ఉండడంటే ఆశ్చర్యం లేదు. అలా బుల్లితెరపై ‘కలర్స్’ షోతో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, తన అల్లరితో, చలాకీతనంతో అందరి మనసులు దోచేసుకున్న ఈ తెలుగమ్మాయి, వెండితెరపైనా తనదైన ముద్ర వేసింది. సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒక నటి సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ స్వాతిరెడ్డి మాత్రం తన విలక్షణమైన నటనతో, సహజసిద్ధమైన ఎక్స్ ప్రెషన్స్ తో టాలీవుడ్‌లో స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుందనే చెప్పాలి.

నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డును కూడా

Advertisement

సినిమాల విషయానికే వస్తే ..క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘డేంజర్’ సినిమాతో స్వాతి వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2007లో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలో చెల్లెలిగా నటించి, తన కామెడీ టైమింగ్‌తో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన మైలేజ్‌తో 2008లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చెమ్మా’ సినిమాతో హీరోయిన్‌గా మారి నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది కూడా.

also read :ఒకప్పటి టాలీవుడ్ గ్లామర్ క్వీన్ రంభ ఇంట తీవ్ర విషాదం.. నా ప్రపంచం శూన్యమైందంటూ ఎమోషనల్ పోస్ట్!

Advertisement

ఆ తర్వాత ‘కలవరమాయే మదిలో’, నిఖిల్‌తో చేసిన ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ వంటి విభిన్నమైన సినిమాలతో విజయాలను అందుకుంది. హారర్ థ్రిల్లర్ ‘త్రిపుర’ సినిమాలోనూ అలరించిన స్వాతి, కొంతకాలం గ్యాప్ తర్వాత 2023లో ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో  వైరల్

ప్రస్తుతం వెండితెరకు కాస్త దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ, సోషల్ మీడియాలో అలాగే ఇంటర్వ్యూలలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్వాతి తన వ్యక్తిగత జీవితం, పెళ్లి బంధంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ రోజుల్లో వివాహ బంధాలు ఎంత సున్నితంగా మారిపోతున్నాయో, మనుషుల మధ్య నమ్మకం ఎలా సడలిపోతుందో ఆమె చాలా బోల్డ్‌గా పంచుకున్నారు.

also read :ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్.. చిరంజీవి నివాసంలో గంటన్నర సుదీర్ఘ చర్చలు.. ఏం జరిగిందంటే?

ఈ తరం సెంటిమెంట్లు, మారుతున్న జీవనశైలిని ప్రతిబింబిస్తూ స్వాతి చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఈ రోజుల్లో ఒక మనిషిని పూర్తిస్థాయిలో నమ్మి, వివాహం చేసుకుని, జీవితాంతం కలిసి ఉండటం అనేది ఒక పెద్ద టాస్క్‌లా మారిపోయిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుత సమాజంలో ఎవరికీ కూడా కొంచెం కూడా ఓపిక, సహనం ఉండడం లేదని పెదవి విరిచింది. ఒక ముక్కు, మొహం తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకుని, అతని అలవాట్లకు సర్దుకుపోతూ, ప్రతిరోజూ మానసిక ప్రశాంతతను కోల్పోవడం తనకు అస్సలు ఇష్టం లేదని తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది.

ఒక కుక్కను పెంచుకోవడం ఎంతో ఉత్తమం

పెళ్లి చేసుకుని రోజూ టెన్షన్ పడడం కంటే, హాయిగా ఎటువంటి చింత లేకుండా ఒక కుక్కను పెంచుకోవడం ఎంతో ఉత్తమమని స్వాతిరెడ్డి ఒక క్రేజీ సజీషన్ ఇచ్చింది.మనుషులతో పోలిస్తే మూగజీవాలు చూపించే ప్రేమ ఎంతో స్వచ్ఛమైనదని, ఒక కుక్క మనకు ఎప్పుడూ నమ్మకంగా ఉంటుందని తెలిపింది. ఎలాంటి కండిషన్లు పెట్టకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా మనల్ని ప్రాణంగా ప్రేమిస్తుందని, అందుకే మానసిక ప్రశాంతతకు పెళ్లి కంటే పెట్ యానిమల్సే బెటర్ అంటూ స్వాతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. చూడాలి మరి బోల్డ్ గా వదిలిన ఈ కామెంట్స్ పై మగ మహానుభావులు ఎలా రియాక్ట్ అవుతారో !

also read :ఎగ్జిబిటర్ల పరిస్థితి చూస్తే జాలేస్తోంది.. టాలీవుడ్ సంక్షోభంపై బాలయ్య షాకింగ్ కామెంట్స్!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×