E-Paper
Advertisement

బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టిన ధురంధర్2.. శోభు యార్లగడ్డ పోస్ట్ వైరల్!

బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టిన ధురంధర్2.. శోభు యార్లగడ్డ పోస్ట్ వైరల్!
Advertisement

Dhurandhar 2: ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ధురంధర్2 (Dhurandhar 2) హవా కొనసాగుతోంది. కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఈ సినిమా ప్రసారమవుతూ విపరీతమైన ఆదరణను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్ల విషయంలో కూడా ఈ సినిమా జోరు కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించిందని చెప్పాలి. ఈ సినిమా పది రోజులలోనే ఏకంగా 1200 కోట్ల కలెక్షన్లను రాబట్టి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా విడుదల అయ్యి పది రోజులు అయినప్పటికీ ప్రతి ఒక్క చోట హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.

అక్కడ బాహుబలి 2 రికార్డు బ్రేక్..

ఇక ఈ సినిమా ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటివరకు ఉత్తర అమెరికాలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాగా బాహుబలి 2 రికార్డు సాధించింది. గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ బాహుబలి రికార్డులను మాత్రం చెరిపేయలేకపోయాయి. అయితే తాజాగా ఉత్తరా అమెరికాలో ధురంధర్2 సినిమా కేవలం పది రోజులలోనే 20 మిలియన్ల డాలర్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఒక నేటిజన్ ధురంధర్2 బాహుబలి 2రికార్డులను బద్దలు కొట్టింది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

Advertisement

ధురంధర్2 సినిమాను ఎంజాయ్ చేసాను..

ఇక ఈ పోస్ట్ చూసినటువంటి బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda)నేటిజన్ చేసినటువంటి పోస్ట్ పై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. “ఇటీవల తాను కూడా ధురంధర్2 సినిమా చూశానని ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేశానని తెలిపారు. ఈ సినిమా అన్ని రికార్డులను బద్దల కొడుతూ సరికొత్త రికార్డులను సృష్టించడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి మంచి సక్సెస్ అందుకున్నందుకు చిత్ర బృందానికి అభినందనలు” అంటూ శోభు యార్లగడ్డ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాపై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే దర్శకుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్క హీరో కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

Advertisement

ఈ సూపర్ హిట్ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమాలో తమిళ నటుడు మాధవన్ బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, అర్జున్ రామ్ పాల్, సారా అర్జున్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాతో డైరెక్టర్ ఆదిత్యధర్ పేరు కూడా పాన్ ఇండియా స్థాయిలో మారుమోగుతుంది. ఇలా ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకోవడంతో మూడో భాగం కూడా రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు అయితే ఈ సినిమా దాదాపు ఉండకపోవచ్చు అని చిత్ర బృందం తెలియచేశారు కానీ అధికారకంగా మాత్రం వెల్లడించలేదు.

Also Read: Mrutyunjay OTT: ఇట్స్ అఫీషియల్ ఓటీటీలోకి శ్రీ విష్ణు మృత్యుంజయ్..ఎప్పుడంటే!

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×