E-Paper
Advertisement

బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టిన ధురంధర్2.. శోభు యార్లగడ్డ పోస్ట్ వైరల్!

బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టిన ధురంధర్2.. శోభు యార్లగడ్డ పోస్ట్ వైరల్!
Advertisement

Dhurandhar 2: ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ధురంధర్2 (Dhurandhar 2) హవా కొనసాగుతోంది. కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఈ సినిమా ప్రసారమవుతూ విపరీతమైన ఆదరణను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్ల విషయంలో కూడా ఈ సినిమా జోరు కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించిందని చెప్పాలి. ఈ సినిమా పది రోజులలోనే ఏకంగా 1200 కోట్ల కలెక్షన్లను రాబట్టి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా విడుదల అయ్యి పది రోజులు అయినప్పటికీ ప్రతి ఒక్క చోట హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.

అక్కడ బాహుబలి 2 రికార్డు బ్రేక్..

ఇక ఈ సినిమా ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటివరకు ఉత్తర అమెరికాలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాగా బాహుబలి 2 రికార్డు సాధించింది. గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ బాహుబలి రికార్డులను మాత్రం చెరిపేయలేకపోయాయి. అయితే తాజాగా ఉత్తరా అమెరికాలో ధురంధర్2 సినిమా కేవలం పది రోజులలోనే 20 మిలియన్ల డాలర్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఒక నేటిజన్ ధురంధర్2 బాహుబలి 2రికార్డులను బద్దలు కొట్టింది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

Advertisement

ధురంధర్2 సినిమాను ఎంజాయ్ చేసాను..

ఇక ఈ పోస్ట్ చూసినటువంటి బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda)నేటిజన్ చేసినటువంటి పోస్ట్ పై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. “ఇటీవల తాను కూడా ధురంధర్2 సినిమా చూశానని ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేశానని తెలిపారు. ఈ సినిమా అన్ని రికార్డులను బద్దల కొడుతూ సరికొత్త రికార్డులను సృష్టించడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి మంచి సక్సెస్ అందుకున్నందుకు చిత్ర బృందానికి అభినందనలు” అంటూ శోభు యార్లగడ్డ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాపై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే దర్శకుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్క హీరో కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

Advertisement

ఈ సూపర్ హిట్ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమాలో తమిళ నటుడు మాధవన్ బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, అర్జున్ రామ్ పాల్, సారా అర్జున్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాతో డైరెక్టర్ ఆదిత్యధర్ పేరు కూడా పాన్ ఇండియా స్థాయిలో మారుమోగుతుంది. ఇలా ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకోవడంతో మూడో భాగం కూడా రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు అయితే ఈ సినిమా దాదాపు ఉండకపోవచ్చు అని చిత్ర బృందం తెలియచేశారు కానీ అధికారకంగా మాత్రం వెల్లడించలేదు.

Also Read: Mrutyunjay OTT: ఇట్స్ అఫీషియల్ ఓటీటీలోకి శ్రీ విష్ణు మృత్యుంజయ్..ఎప్పుడంటే!

Related News

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

Big Stories

Advertisement
×