Peddi Movie : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. త్రిబుల్ ఆర్ తర్వాత భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 30 న విడుదల అవ్వాల్సి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరింత బెటర్ గా ఉండడం కోసం కాస్త సమయాన్ని తీసుకున్నారు. దీంతో ఈ మూవీ జూన్ నెలకు వాయిదా పడింది. మరో 6 రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.. ఈ క్రమంలో ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. కేవలం ఒక్క సీను కోసం దాదాపు మూడు నెలలు రామ్ చరణ్ కష్టపడినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ సూపర్ సీన్ ఏంటో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
పెద్ది మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా పహిల్వాన్ టీజర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఆ సీను మాత్రం మెగా ఫాన్స్ కి పూనకాలు తెప్పించింది అని చెప్పాలి. ఆ టీజర్ వీడియో క్షణాల్లో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీక్వెన్స్ సినిమాలో 3 నిమిషాల వరకు ఉంటుందట.. ఏపీ రాష్ట్రం తరఫునుంచి హీరో రామ్ చరణ్ కుస్తీ పోటీల్లో పాల్గొంటాడట.. రాజస్థాన్ కుస్తీ పోటీదారులతో పోటీ పడబోతున్నాడు అట. ఈ సీక్వెన్స్ మొత్తం అద్భుతంగా వచ్చిందని, థియేటర్స్ లో చూసే వాళ్లకు గూస్ బంప్స్ పక్కా అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రామ్ చరణ్ ఈ సీన్ కోసం ఎంత కష్టపడ్డాడో అంతకు మించి వీఎఫ్క్స్ కంపెనీ కూడా బాగా కష్టపడిందట. ఈ సీన్ పూర్తి చెయ్యడానికి దాదాపుగా 3 నెలల సమయం పట్టిందని టాక్.. కేవలం ఒక్క సీన్కే అంత టైం పడితే సినిమాకి ఇంకెంత టైం పట్టిందో అని ప్రస్తుతం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా ఆ లుక్ లో మాత్రం రామ్ చరణ్ అదిరిపోయాడని చెప్పాలి.. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాకు ఇదే హైలెట్ సీన్..
Also Read : చిరు-చెర్రీ కాంబోలో మూవీ.. రిస్క్ చేస్తున్న స్టార్ డైరెక్టర్..?
రామ్ చరణ్, జాన్వి కపూర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని మెగా అభిమానులు అలాగే సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా జనాలకి విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగు ప్రస్తుతం వనస్థలిపురంలో జరగనుంది. టాకీ పార్ట్అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఐటెం సాంగ్ చిత్రీకరణ జరగనుందని తెలుస్తుంది. మృణాల్ ఠాకూర్, రామ్ చరణ్ కాంబోలో ఈ సాంగ్ ఉండబోతుందని టాక్. ఈ సాంగ్ పూర్తవుగానే వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిచేసి ప్రమోషన్స్ ని మొదలుపెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సినిమాకు అంచనాలు ఎక్కువగానే ఉండడంతో ఈసారి బ్లాక్ బస్టర్ హీట్ పక్కా అని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. మరి రాంచరణ్ పెద్ది మూవీతో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాడో చూడాలి.