Manasantha Nuvve Re Release: దివంగత హీరో ఉదయ్ కిరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు. ఎన్నో యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చిత్రాలతో అలరించిన ఈ హీరోకి మేల్, ఫీమేల్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉందనడంలో సందేహం లేదు. 90’s,20′లో ప్రేమకథ సినిమాలు చేస్తూ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. చిత్రం, నువ్వే–నువ్వే, మనసంత నువ్వే సినిమాలతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలు ఉదయ్ కిరణ్ కెరీర్లో ఓ మైలురాయి అని చెప్పాలి. ఈ చిత్రాలు ఒక్కసారిగా ఉదయ్ని స్టార్ హీరోని చేశాయి, ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా మార్చాయి.
అలా ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఉదయ్ని ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ వెంటాడాయి. అతడితో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్ కూడా ముందు రాకపోవడం ఉదయ్ సినీ కెరీర్ స్లో డౌన్ అయ్యాయి. అలా కొంతకాలంగా ఈ యంగ్ హీరో ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. అదే టైంలో ఉదయ్ చావు కబురు అందరికి షాకిచ్చింది. ఉదయ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ ఉన్నట్టు వార్త బయటకు రావడంతో అభిమానులంత షాక్కు గురయ్యారు. ఇప్పటికీ ఈ హీరో మరణాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేపోతున్నారు. అతడి చావు కారణమేంటనేది ఎంతగానో ఆరా తీస్తున్నారు. కానీ, దీనికి ఖచ్చితమైనా ఆధారాలు, కారణాలు మాత్రం బయటపడటం లేదు. దీంతో ఇప్పటికీ ఉదయ్ కిరణ్ మరణం మిస్టరీగా ఉండిపోయింది.
ఇదిలా ఉంటే తమ అభిమాన హీరో అర్దాంతరంగా పోగోట్టుకున్న ఫ్యాన్స్ మాత్రం మళ్లీ ఆయనను వెండితెరపై ఓసారి చూడాలని ఆశపడుతుంటారు. ఈ క్రమంలో ఆయన హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేయాలని ఆయా డైరెక్టర్లు, నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో నువ్వే–నువ్వే, మనసంతా నువ్వే చిత్రాలు రీ–రిలీజ్ చేయాలని కుప్పలు కుప్పలు రిక్వెస్ట్స్ వెళుతున్నాయట. దీంతో ఈ సినిమా రీ రిలీజ్ అనేది హాట్ టాపిక్ మారింది. అలాగే అవి మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయంటూ తరచూ సోషల్ మీడియా వార్తలు వస్తుంటాయి. ఇందులో ఎక్కువ ఆసక్తిని ఇస్తున్న అప్డేట్ మాత్రం మనసంతా నువ్వే రీ రిలీజ్. ఈ సినిమా రీ రిలీజ్ అవుతుందంటూ తరచూ వార్తలు వినిపిస్తుంటాయి.
Also Read: Uday Kiran: ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణం ఇదే.. ‘మనసంతా నువ్వే‘ డైరెక్టర్ కామెంట్స్!
ఈ క్రమంలో మనసంత నువ్వే రీ రిలీజ్ పై తాజాగా ఆ మూవీ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య (Manasanth Nuvve Director VN Aditya) స్పందించారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ సినిమా రీ రిలీజ్, ఉదయ్ కిరణ్తో తనకు ఉన్న అనుబంధంపై స్పందించారు. “మనసంతా నువ్వే సినిమా రీ రిలీజ్ చేయాలని తరచూ ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ అడుగుతుంటారు. ఇప్పుడు అన్ని సినిమాలు అవుతున్నాయి. ఈ సినిమా రీ రిలీజ్ చేయడమనేది నిర్మాత నిర్ణయం. సినిమాను 4k టెక్నాలజీకి మార్చి థియేటర్లకు తీసుకురావడమనేది బడ్జెట్తో కూడుకున్న విషయం. హీరో రన్నింగ్లో ఉన్నాడంటే అభిమానుల కోసం ఈ సినిమాని రీ–రిలీజ్ చేయడం ఈజీ. కానీ, ఇప్పుడు హీరోనే లేడు. ఒక్క ఎమోషన్ కోసం సినిమాని రీ రిలీజ్ చేస్తే.. నిర్మాతలకు ఏం లాభం ఉండదు” అని చెప్పుకొచ్చారు. ఆయన కామెంట్స్ చూస్తుంటే మనసంతా నువ్వే రీ రిలీజ్ అనేది అసలు ఉండకపోవచ్చని అర్థమైపోతుంది.