Geetha Singh: తెలుగు చిత్ర పరిశ్రమలో ‘కితకితలు’ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి గీతా సింగ్, గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత విషాదకరమైన విషయాలను పంచుకున్నారు. తాను ఎందుకు వివాహం చేసుకోలేదు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన కొడుకును ఎలా కోల్పోయారో వివరిస్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
Read also-Romantic drama OTT… టీనేజ్ వయసులో ప్రేమ…10 ఏళ్ల తర్వాత షాకింగ్ ట్విస్టులు… లవర్స్ చూడాల్సిన స్టోరీ
గీతా సింగ్ తన వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అయితే, తన తమ్ముడి పిల్లలనే తన సొంత బిడ్డలుగా భావించి పెంచారు. తాను సంపాదించిన ప్రతి రూపాయిని వారి చదువుల కోసమే ఖర్చు చేశానని, వారే తన ఆస్తి అని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆమె పెంచుకున్న కొడుకు (తమ్ముడి కుమారుడు) అకాల మరణం చెందడం ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసింది.
మంచి చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగంలో స్థిరపడే వయసులో ఉన్న తన కుమారుడు ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు ఆమె తెలిపారు. స్నేహితులతో కలిసి టూర్కు వెళ్ళిన సమయంలో కారు డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన గీతా సింగ్ను మానసిక వేదనకు గురిచేసింది. ఆ బాధ నుండి కోలుకోలేక, కెరీర్పై దృష్టి పెట్టలేక ఆమె సినిమాలకు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ విషాదం నుండి నెమ్మదిగా బయటపడుతున్న ఆమె, ‘గుడుగుడు గుంచం’ అనే ప్రైవేట్ సాంగ్ ద్వారా మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు.