Harish Shankar: పవర్స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా, కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏప్రిల్లో విడుదల కావాల్సిన ఈ సినిమా మార్చి 26న విడుదలయ్యేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ని హరీశ్ శంకర్ పరుగులు పెట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు చిత్ర ప్రమోషన్స్ని కూడా ఓ రేంజ్లో నిర్వహించాలని హరీశ్ ప్లాన్ చేస్తున్నట్లుగా అర్థమవుతోంది. అదెలా అంటే..
Also Read- Pawan kalyan New Movie: 250 కోట్ల రిస్క్ చేస్తున్న పవన్ కళ్యాణ్… అది కూడా ఫ్లాప్ డైరెక్టర్తో..!
పవన్ కళ్యాణ్ సినిమా అంటే అప్డేట్స్ ఎప్పుడో గానీ రావు, అలాంటిది, వరుసగా ఏదో ఒక అప్డేట్ని వదులుతూ హరీశ్ శంకర్ ఈ సినిమాపై భారీగా హైప్ పెంచేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ‘దేఖ్లేంగే సాలా’ చార్ట్బస్టర్గా నిలవగా, ఇప్పుడు రెండో పాటను మేకర్స్ వదలబోతున్నారు. ఈ పాట విడుదలను పురస్కరించుకుని హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉన్నారు. రెండో పాట ఆల్రెడీ లీకైందని, అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ.. హరీశ్కు ఇంకా హుషారిస్తున్నారు. దీంతో ఆయన ఈ పాట సిట్టింగ్స్ టైమ్లో ఏం జరిగిందో తెలుపుతూ తాజాగా ఓ వీడియో వదిలారు. ‘దేవి సమక్షంలో.. దేవుని పాట’ అంటూ హరీష్ శంకర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read- Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ ఫుల్ మాస్ ప్లాన్.. ఏకంగా నందమూరి హీరోతో..!
ఇక్కడ దేవి అంటే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. దేవుడు అంటే ఇళయరాజా. అవును.. వీరు ముగ్గురు (చంద్రబోస్, హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్) కలిసి కూర్చుని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పాట గురించి చర్చించడం లేదు. ఇళయరాజా కంపోజ్ చేసిన ‘గీతాంజలి’ చిత్రంలోని ‘ఓం నమ: నమ:’ పాటను పాడుతున్నారు. దేవిశ్రీ వారి పాటకు అనుగుణంగా దరువేస్తున్నారు. మరి ఈ పాటకు, రాబోయే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పాటకు ఏమైనా సంబంధం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ పాటను మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 15వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ఎక్కడా రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు.
https://twitter.com/harish2you/status/2021190685479641474
Also Read- Allu Arjun: పరువు నష్టం దావా.. 42 నిబంధనల వార్తలపై ఘాటుగా స్పందించిన అల్లు అర్జున్ టీమ్!