E-Paper
Advertisement

Maniratnam: అప్పుల బాధతో మణిరత్నం సోదరుడు మృతి.. 23 ఏళ్ల తర్వాత తీర్పునిచ్చిన హైకోర్టు

Maniratnam: అప్పుల బాధతో మణిరత్నం సోదరుడు మృతి.. 23 ఏళ్ల తర్వాత తీర్పునిచ్చిన హైకోర్టు

Maniratnam:దిగ్గజ దర్శక ధీరుడు మణిరత్నం (Maniratnam )గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన అద్భుతమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే ఈయన.. ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ సాధించలేదు అని చెప్పాలి. పొన్నియిన్ సెల్వన్ 1,2 చిత్రాలు చేసి పర్వాలేదు అనిపించుకున్న మణిరత్నం.. ఇటీవల కమలహాసన్(Kamal Haasan) తో ‘థగ్ లైఫ్’ సినిమా చేసి నిరాశపరిచారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది
. దీనికి తోడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల కారణంగా కర్ణాటకలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

తప్పుడు పత్రాలు సమర్పించారని మణిరత్నం సోదరుడిపై కేసు ఫైల్..

ఇదిలా ఉండగా మణిరత్నం సోదరుడు ప్రముఖ నిర్మాత అప్పుల బాధతో మరణించగా.. ఇప్పుడు 23 ఏళ్ల తర్వాత చెన్నై ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వడం వైరల్ గా మారింది. 1996లో మణిరత్నం సోదరుడు తమిళ సినీ నిర్మాత జి. వెంకటేశ్వరన్(G.Venkateswaran ) .. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకు లోన్ తీసుకున్నారంటూ.. బ్యాంకు ఫిర్యాదు చేయగా.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలు సమర్పించి.. రూ.10.19 కోట్లు బ్యాంకు నుంచి పొందినట్లు కేస్ ఫైల్ అయింది. సుమారు 30 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసులో తాజాగా చెన్నై ప్రత్యేక కోర్ట్ తీర్పునిచ్చింది.

23 ఏళ్ల తర్వాత చెన్నై ప్రత్యేక కోర్టు తీర్పు..

ముఖ్యంగా బ్యాంకును మోసం చేసిన కేసులో మొత్తం తొమ్మిది మందిని దోషులుగా నిర్ధారించారు. కానీ వెంకటేశ్వరన్ తోపాటు మరో ముగ్గురు బ్యాంక్ అధికారులు మరణించడంతో వారిపై ఉన్న అభియోగాలు ఇప్పటికే కొట్టి వేయబడ్డాయి. కేసుతో సంబంధం ఉన్న మిగిలిన ఐదుగురు పరిస్థితి గురించి తెలుసుకోవాలని అధికారులను కోరుతూ ఆదేశాలు జారీ చేసింది. ఏది ఏమైనా 2003లో జి. వెంకటేశ్వరన్ అప్పుల బాధతో మరణిస్తే.. 23 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఇవ్వడం వైరల్ గా మారింది.

ఆత్మహత్య చేసుకున్న మణిరత్నం సోదరుడు..

మణిరత్నం అన్నయ్య వెంకటేశ్వరన్ పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా మౌనరాగం నుంచి దళపతి వరకు మణిరత్నం దర్శకత్వం వహించిన పలు హిట్టు చిత్రాలకు జీవి ప్రొడ్యూసర్ గా ఆయన వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత నిర్మించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో.. అప్పుల బాధ తాళలేక 2003 మే మూడవ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల ఒత్తిడి.. నిర్మాతల నుంచి అప్పులు తీసుకొని సినిమాలను నిర్మించినా.. వాటి నుంచి వచ్చిన నష్టాలను తట్టుకోలేకపోయారని.. పైగా ఆ సమయంలో ఎవరు సహాయం చేయలేదని, తమిళ నిర్మాత మాణిక్యం నారాయణన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. పైగా కొడుకు పెళ్లి సమయంలో కూడా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. అలా అప్పుల బాధలు తట్టుకోలేక తన జీవితాన్ని ముగించుకున్నారని సమాచారం.

ALSO READ:Sundarakanda Collection : నారా రోహిత్ మూవీకి ఘోర పరాభవం… ఫస్ట్ డే అరకోటి కూడా రాలే ?

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×