E-Paper
Advertisement

Jr.NTR: ఉమెన్ వరల్డ్ కప్ పై తారక్ ట్వీట్…అడ్డంగా దొరికిపోయావ్ ఏంటన్నా?

Jr.NTR: ఉమెన్ వరల్డ్ కప్ పై తారక్ ట్వీట్…అడ్డంగా దొరికిపోయావ్ ఏంటన్నా?

Jr NTR: భారతీయుల ఎన్నో దశాబ్దాల కళ నెరవేరిన సంగతి తెలిసిందే. భారత మహిళ క్రికెట్ జట్టు ఎన్నో సార్లు ఫైనల్ కు వెళ్లి వరల్డ్ కప్ లో నిరాశను ఎదుర్కొంది. అయితే 2025 వరల్డ్ కప్ లో విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో సంవత్సరాల కళ నెరవేరడంతో ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ విజయాన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా భారత మహిళా జట్టు వరల్డ్ కప్ (Women world Cup)సొంతం చేసుకోవడంతో సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఈ విజయం పై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

ఒక్క ట్వీట్ తో విమర్శల పాలైన తారక్..

ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి ఎన్టీఆర్, వెంకటేష్, రాజమౌళి వంటి తదితరులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నటుడు ఎన్టీఆర్ (NTR)ఈ మహిళా జట్టును ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం విమర్శలను ఎదుర్కొంటుంది. ఎన్టీఆర్ ఈ సందర్భంగా స్పందిస్తూ..ప్ర‌పంచ ఛాంపియ‌న్స్‌గా నిలిచినందుకు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టుకి అభినంద‌న‌లు. ఎంతో ధైర్యంతో పోరాడుతూ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయం పట్ల భారతీయులందరూ మీకు సలాం కొడుతున్నారు అంటూ ఈయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చాట్ జీపీటీతో చేస్తే తప్పేంటీ?

ఇక ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంటనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ చాట్ జీపీటీ (Chat Gpt)సహాయంతో చేసినదని తెలియడంతో ఈయన పట్ల విమర్శలు వస్తున్నాయి. స్కూల్ కి వెళ్లి చదువుకునే టైం ఆసన్నమైంది అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరి కొంతమంది ఇలా దొరికిపోయావు ఏంటి అన్న అంటూ కామెంట్ లు చేస్తున్నారు. అయితే మరి కొంతమంది ఎన్టీఆర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. అసలు ఈ చాట్ జిపిటి ఉన్నదే మన పనిని సులభంగా చేసుకోవడానికి అలాంటిది తారక్ దీనిని ఉపయోగించి ట్వీట్ చేస్తే తప్పేంటి అంటూ కూడా ఎన్టీఆర్ కు మద్దతుగా నిలుస్తున్నారు.

ప్రస్తుతం తారక్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఎన్టీఆర్ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల వార్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prashanth Neel) డ్రాగన్(Dragon) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో 2027 లో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇక రుక్మిణి వసంత్ ఇటీవల కాంతార చాప్టర్ 1 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Also Read: Kantara1: ఓటీటీలోకి వచ్చినా ఆగని కాంతార 1 కలెక్షన్ల సునామి.. అక్కడ సరికొత్త రికార్డు!

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×