E-Paper
Advertisement

Mahesh Babu: వారణాసి కోసం 15 ఏళ్ల నిరీక్షణ… అసలు విషయం చెప్పిన మహేష్!

Mahesh Babu: వారణాసి కోసం 15 ఏళ్ల నిరీక్షణ… అసలు విషయం చెప్పిన మహేష్!
Advertisement

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వారణాసి(Varanasi) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మహేష్ బాబు కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే నటించారు కానీ ఈయన నటించిన సినిమాలు తెలుగు భాషకు మాత్రమే పరిమితం అయ్యాయి కానీ ఏవి కూడా ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాలేదు. మొదటిసారి రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న వారణాసి సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా 2027 ఏప్రిల్ ఏడవ తేదీ విడుదల కాబోతున్నట్టు ఇటీవల చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు.

15 సంవత్సరాల క్రితమే చేయాల్సిన సినిమా..

ఇక ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాదులో ఒక షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఇంటర్నేషనల్ మీడియాతో కలిసి పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ బాబు వారణాసి సినిమాలో నటించడం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ తాను రాజమౌళితో కలిసి వారణాసి సినిమా గత 15 సంవత్సరాల క్రితమే చేయాల్సి ఉందని తెలియజేశారు.

కోవిడ్ కారణంగా..

Advertisement

వారణాసి సినిమా కోసం 15 సంవత్సరాల క్రితం తాను రాజమౌళిని కలిశాను. అయితే ఆ సమయంలో రాజమౌళి బాహుబలి సినిమా పనులలో బిజీగా ఉన్నారు. బాహుబలి రెండు భాగాలు పూర్తి అయిన తరువాత వారణాసి సినిమా చేస్తానని తెలిపారు. కానీ తిరిగి రాజమౌళి RRR సినిమాను మొదలు పెట్టారని ఆ తరువాత కోవిడ్ కారణంగా వారణాసి సినిమా రావడానికి 15 సంవత్సరాలు పట్టింది అంటూ మహేష్ బాబు తెలియజేశారు. ఇలా ఈ అడ్డంకులు లేకపోతే వారణాసి సినిమా గత 15 సంవత్సరాల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చేదని తెలుస్తోంది.

ఆలస్యం అవ్వటమే మంచిదైందా..

Advertisement

ఈ సినిమా గురించి మహేష్ బాబు చేసిన కామెంట్లపై ఆయన అభిమానులు స్పందిస్తూ.. ఒకవేళ 15 సంవత్సరాల క్రితమే ఈ సినిమా వచ్చి ఉంటే కనుక ఇంత పెద్ద క్రేజ్ ఉండేది కాదని, అప్పుడు కూడా ఈ సినిమా ఒక తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యేది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఈ సినిమా ఆలస్యం కావడం వల్లే మహేష్ బాబు గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఒకరకంగా ఈ సినిమా ఆలస్యం అవ్వడమే మంచిదైదని మహేష్ బాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నట్టు ఇదివరకే ఈయన పాత్రను పరిచయం చేశారు. అలాగే ఇందులో రాముడిగా మహేష్ బాబు కనిపించబోతున్నారని ఈ పాత్ర దాదాపు 25 నిమిషాల పాటు ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్రలో విలన్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ద్వారా రాజమౌళి గ్లోబల్ రేంజ్ లో ఎలాంటి సక్సెస్ అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Mrunal Thakur: అల్లు అర్జున్ సినిమాలో మృణాళ్ ఠాకూర్…గ్రాండ్ పార్టీ ఇస్తానన్న బ్యూటీ!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×