Podarillu Today Episode May 28th : కేశవ కి ఫోన్ చేసి చక్రీ తన బాధని చెప్పుకుంటాడు.. ఇంట్లో జరుగుతుంటే అందరూ నటనతో చంపేస్తున్నారు అని కేశవతో తన బాధని చెప్పుకొని బాధపడిపోతూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది.. కేశవాతో మాట్లాడుతున్నాను అని చెప్పగానే నేను కూడా మాట్లాడతాను అని ఫోన్ తీసుకొని బురుపిట్ట ఏం చేస్తున్నావు అని అడుగుతుంది.. మాట్లాడుతున్నప్పుడు తప్పించుకుని వెళ్ళిపోయారని బుర్రుపిట్టని అంటారు అని మహాలక్ష్మి అనగానే కేశవ ఫీలవుతాడు. వీడియో కాల్ చేసి మహాలక్ష్మి మాట్లాడుతుంది.. అందరూ మహాలక్ష్మి కోసం బాధపడిపోతూ ఉంటే నారాయణ మాత్రం మందు తాగుతూ బీడీలు తాగుతూ తెగ డాన్సులు వేస్తూ ఉంటారు. ఒక్కసారిగా మహాలక్ష్మి ని చూసి షాక్ అవుతాడు.. మహాలక్ష్మి చక్రిని తన గదిలో పడుకోవాలని పిలుస్తుంది అది విన్న చక్రి షాక్ అవుతాడు..
చక్రిని ఎక్కడ పడుకుంటారు అని ప్రతాప్ అలాగే ఆది ఇద్దరు కూడా అవమానించాలా మాట్లాడుతారు.. అల్లుడుగారు ఎక్కడ పడుకుంటారు అర్థం కావడం లేదే అని ప్రతాప్లో వెటకారంగా మాట్లాడడంతో ఆది అవెంజర్ కార్ డ్రైవర్ ఎక్కడ పడుకుంటారు వెనకాల ఉన్న కార్పెంటర్లో పడుకుంటారు అని అంటాడు.. కారు షెడ్డులో పడుకోవాల్సిన అవసరం నాకేంటి ఏం మాట్లాడుతున్నావ్ బామ్మర్ది? బావని ఎలా చూసుకోవాలి నీకు తెలియదా అని ఆది పై చక్రి కౌంటర్లు వేస్తాడు.. ఏం మాట్లాడుతున్నావ్ రా నీకు ఎంత పొగరు రాని ఆది చక్రిని దారుణంగా అవమానిస్తాడు.. కానీ చక్రి మాత్రం వీళ్ళు కావాలని నన్ను రెచ్చగొడుతున్నారు అని అనుకోని మౌనంగా ఉంటాడు.
ఇక చక్రి అక్కడ మాట్లాడుతూ ఉండగా మహాలక్ష్మి ఏవండీ మీరు పడుకుంటారా అని అడుగుతుంది. నేను డ్రైవింగ్ చేస్తే బాగా అలసిపోయారు బామ్మర్ది వెళ్లి పడుకుంటాను నువ్వు మీ అమ్మ మీ నాన్న వాళ్ళతో మాట్లాడేసి రా అనేసి మహాలక్ష్మి చక్రి అంటాడు.. అయితే లోపల రెండు బెడ్లు ఉండడం చూసి చక్రి నాకు బెడ్ ఇచ్చి తన కింద పడుకుంటున్నా అని ఆలోచిస్తూ ఉంటాడు.. అయితే పైన బెడ్ మీద పడుకో పోతుంటే మహాలక్ష్మి లోపలికి రావచ్చా అని అడుగుతుంది.. మీరంతా మంచి వాళ్లండి నాకోసం పెట్టిచ్చి మీరు కింద పడుకోవడానికి పరుపు వేసుకున్నారా అని అడక్కని హలో అది నాకోసం కాదు మీకోసం అని మహాలక్ష్మి అంటుంది ఆ మాట వినగానే చక్రీ ఫ్యూజుల్ అవుట్..
కన్నా బయట కూర్చుని బాధపడిపోతూ ఉంటాడు. మాధవ్ టీ తీసుకొని వచ్చి ఇస్తాడు.. నువ్వు చదువుకోరా అని అంటాడు.. వదిన ఉంటే బాగుండేది. నన్ను చదువుకోమని కొట్టి మరి చదివించేది కదిలకి ఇప్పుడు చదువుకోవాలని లేదు.. అన్నయ్య ఇంతకీ వదిన నిజంగానే మళ్లీ మన ఇంటికి వస్తుందా రాదా అని కన్నా బెంగ పెట్టుకుంటాడు.. ఇక నారాయణ వచ్చి ఫ్రైడ్ రైస్ తింటావా అని కన్నాని అడుగుతాడు.. కన్న వద్దు అని అనడంతో నారాయణ నీకొద్దకపోతే నేను తింటాను అని తింటాడు. అయితే నారాయణ ఆత్రంగా తినడంతో గొంతులో పట్టుకోవడంతో కర్ణ చూసి కూడా చూడనట్టు ఉండి లాస్ట్ కి మంచినీళ్లు తెచ్చిస్తాడు. ప్రాణం విలువ పోతుంటే నీకు అర్థం కాదా అని అంటారు నారాయణ. అది విన్న కన్నా మాధవ్ అన్న ఇవాళ అమ్మని చంపేసావు అప్పుడు నీకు ప్రాణ విలువ తెలియలేదా. ఎంతగా అడిగినా సరే నారాయణ మాత్రం కన్నా వాళ్ళ అమ్మ గురించి చెప్పాడు..
మహా ఉదయం లేవగానే కాఫీ తాగుతూ నీ చేతికి కాఫీ తాగి ఎన్ని రోజులైంది అమ్మ నువ్వు కాఫీ అంతా బాగా చేస్తావు అని అడుగుతుంది. ఏంటి నీకు ఆ ఇంట్లో కాఫీ అనేది ఇవ్వరా అని అడుగుతుంది లలిత. అందరూ టీ తాగుతారు నన్ను ఇంట్లో మహారాణి లాగా చూసుకుంటారని ఆ ఇంటి గురించి గొప్పగా చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. హారిక కు కాఫీ తెచ్చాను మరి ఎక్కడికి వెళ్ళింది అని లలిత అడుగుతుంది అయితే స్నానానికి వెళ్ళింది అని అది చెప్పగానే ఆ కాఫీ ని తీసుకుని చెక్రికి ఇవ్వడానికి వెళ్తుంది మహాలక్ష్మి. మహాలక్ష్మి నాకోసం కాఫీ తీసుకొని వచ్చిందంటే నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంది అని చెక్రి కూడా చాలా సంతోషంగా ఉంటాడు..
శైలు కేశవతో ఒక్క రీల్ అయిన చేయాలి అని అనుకుంటుంది. అయితే కేశవ దానికి ఒప్పుకోకపోవడంతో చోటుని అడుగుతుంది. చోటు ఒప్పుకుంటాడు కానీ కేశవ పెట్టిన కండిషన్ వల్ల అతను భయపడిపోయి మెకానిక్ చేసుకునే దానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు.. శైలు మళ్లీమళ్లీ వద్దన్నా కూడా రావడంతో కేశవ సీరియస్ అయితే శైలు పారుయిపోతుంది.. కానీ చివరికి చోటుకి అనుమానం రావడంతో శైలుని నిజమడుగుతాడు.. ఇక శైలు తన మనసులోని మాటని చోటుతో చెప్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో శైలు తన ప్రేమని కేశవతో చెబుతుంది ఏమో చూడాలి..