Jr NTR: మహిళా దినోత్సవం సందర్భంగా హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒక కార్యక్రమంలో పాల్గొని మహిళల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన తన కొత్త సినిమా ‘డ్రాగన్’ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ చాలా బరువు తగ్గారు. ప్రస్తుతం ఆయన డిఫరెంట్ లుక్ కూడా అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ క్రమంలో.. మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన మాటలు చాలా మందిని ఆలోచింపజేశాయి.
ఆ కార్యక్రమంలో మాట్లాడిన ఎన్టీఆర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం జరుపుకోవడం మంచిదే కానీ మహిళలను ఎలా గౌరవించాలి అని.. పదే పదే గుర్తు చేయాల్సిన పరిస్థితి ఉండకూడదని అన్నారు. ఒక మనిషి పుట్టినప్పటి నుంచే మహిళలను గౌరవించే విధంగా పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
“మహిళలను ఎలా గౌరవించాలి అని మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం నాకు నచ్చదు. ఒక పురుషుడు పుట్టినప్పటి నుంచే తన జీవితంలో ఉన్న మహిళలను గౌరవించేలా పెరగాలి. అదే నిజమైన మార్పు” అని ఎన్టీఆర్ చెప్పారు.
అలాగే భవిష్యత్ తరాలకు ఈ విలువలు చెప్పడం చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. మహిళల పట్ల గౌరవం గురించి కేవలం పాఠశాలలోనే చెప్పడం సరిపోదని, ఆ విద్య ఇంటి నుంచే మొదలవ్వాలని అన్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబం గురించి కూడా ఈ సందర్భంగా చెప్పారు. తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని, వారు పెద్దవాళ్లయ్యే వరకు మహిళలను గౌరవించే వ్యక్తులుగా తయారవ్వాలని తాను చూసుకుంటానని అన్నారు. “నా ఇద్దరు అబ్బాయిలు మహిళలను గౌరవించేలా పెరగడం నా బాధ్యత” అని చెప్పారు.
ఎన్టీఆర్ మాటలు అక్కడ ఉన్నవారిని ఆకట్టుకున్నాయి. ఆయన చివరగా అక్కడ ఉన్న అన్ని మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పలు పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, సమాజానికి అవసరమైన మంచి సందేశాలు ఇవ్వడంలో కూడా ముందుంటున్నారు. మహిళలను గౌరవించడం కుటుంబం నుంచే ప్రారంభం కావాలని ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ALSO READ: Allu Cinemas:అల్లు అర్జున్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. రేపు అల్లు సినిమాస్పై అప్డేట్!