E-Paper
Advertisement

Kantara 2 Premiers: ఏపీలో కాంతార ప్రీమియర్ షోలు రద్దు.. నిరాశలో ఫ్యాన్స్.. కారణం?

Kantara 2 Premiers: ఏపీలో కాంతార ప్రీమియర్ షోలు రద్దు.. నిరాశలో ఫ్యాన్స్.. కారణం?
Advertisement

Kantara 2 Premiers:రిషబ్ శెట్టి.. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కాంతార చాప్టర్ 1. దేశవ్యాప్తంగా అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇవాళ రాత్రి ప్రీమియర్ షోలకు అనుమతి లభించింది. కానీ ఈ ప్రీమియర్ షో లను క్యాన్సిల్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీనికి కారణం ఆశించినంతగా ఆక్యుపెన్సీ లేకపోవడంతోనే ఇలా దేశవ్యాప్తంగా కూడా ప్రీమియర్ షోలు రద్దు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అన్ని షోలు అక్టోబర్ 2 ఉదయం నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. అటు ఏపీలో ఇవాళ రాత్రి 10 గంటల ప్రీమియర్ షోలు కూడా రద్దు కానున్నాయి. ఏది ఏమైనా ఈ విషయం అభిమానులకు భారీ షాక్ కలిగించే అంశం అని చెప్పవచ్చు. మరి అక్టోబర్ 2 దసరా సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని కూడా ఫ్యాన్స్ కోరుతున్నారు.

కాంతార చాప్టర్ 1 సినిమా విశేషాలు..

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో జయరాం , రాకేష్ పూజారి, గుల్హన్ దేవయ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.. ఛాలువే గౌడ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీగా పని చేశారు. అలాగే కెఎన్ ప్రకాష్, శోభిత్ శెట్టి ఎడిటింగ్ బాధ్యతలను తీసుకోగా.. అజనీష్ లోకనాథ్ బి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు.

సినిమాపై సెన్సార్ రివ్యూ..

Advertisement

మరోవైపు సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి కాంతార సీక్వెల్ కావడంతో తాజాగా ఈ సినిమాపై అటు బిజినెస్ పరంగా ఇటు కంటెంట్ పరంగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతేకాదు ఈ చిత్రానికి సెన్సార్ యూఏ సర్టిఫికెట్ జారీ చేయడంతో ఈ సినిమా రివ్యూ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సెన్సార్ ఫార్మాలిటీస్ లో భాగంగా అధికారులు సినిమా చూడగా ఈ సినిమాను రిషబ్ శెట్టి రూపొందించిన విధానం.. కథపై ఆయనకున్న పట్టును తెరపై చూపించిన విధానం.. అలాగే రుక్మిణి వసంత్ పాత్రను కథలో జొప్పించిన తీరుకి అధికారులు ఇంప్రెస్ అయ్యారట. స్టోరీని ఒక కొత్త ప్రపంచంగా మార్చి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడం ఖాయం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. మరి రేపు థియేటర్లలోకి వచ్చే ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.

Advertisement

ALSO READ:Film industry: షాకింగ్.. స్టార్ జంటకు విడాకులు మంజూరు!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×