E-Paper
Advertisement

Movie Tickets: 200 రూపాయలకే మూవీ టికెట్… ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హై కోర్టు

Movie Tickets: 200 రూపాయలకే మూవీ టికెట్… ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హై కోర్టు
Advertisement

Movie Tickets Rates: కాంతార: ది లెజెంట్మూవీ టీం హైకోర్టు ఆశ్రయించింది. కర్ణాటక ప్రభుత్వం టికెట్ధరలను నిర్ణయిస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జీవోని వ్యతిరేకిస్తూ కాంతార మూవీ నిర్మాత విజయ్కీరగందూర్‌ రాష్ట్ర హైకోర్టు లో పిటిషన్దాఖలు చేశారు. మేరకు హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్పై స్టే విధించింది. వివరాలు.. ప్రముఖ దర్శకుడు రిషబ్శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించిన చిత్రం కాంతార: ది లెజెండ్‌. అక్టోబర్‌ 2 సినిమా విడుదలకు సిద్దమౌతోంది. నిజానికి ఎప్పుడో రిలీజ్కావాల్సిన మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. షూటింగ్లో అవాంతరాలు, ప్రమాదాల వల్ల కాంతార ప్రీక్వెల్పై రకరకాల వార్తలు వచ్చాయి. అన్ని అవాంతారాలను ఎదుర్కొని ఎట్టకేలకు మూవీ విడుదల అంత రంగం సిద్దమైంది.

టికెట్స్ రేట్స్ ఇలా..

Advertisement

మరికొన్ని రోజుల్లో కాంతారష్ట్ర: ది లెజెంట్చాప్టర్‌ 1 థియేటర్లలోకి వస్తుండగా.. కర్ణాటక ప్రభుత్వం టికెట్రేట్స్ని నిర్ణయిస్తూ జీవో ఇచ్చింది. ఇందులో సింగిల్స్క్రీన్లో రూ. 120, మల్టీప్లెక్స్లో రూ. 200, ఐమ్యాక్స్‌, 4DX, ICE, 2D థియేటర్లలలో రూ. 230గా టికెట్రేట్లను నిర్ణయిస్తూ ప్రకటన ఇచ్చింది. ఇక మల్టీప్లెక్స్లో 75 సీట్లకు కెపెసిటీ, అంతకంటే తక్కువ కెపిసిటీ సిట్లకు నో ప్రైజ్క్యాప్ఇచ్చింది. దీంతో కాంతార టీం రాష్ట్ర ప్రభుత్వ జీవోని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్వేసింది. ప్రభుత్వానికి టికెట్ల ధరలను నియంత్రించే అధికారం లేదని పటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టులో ఇప్పటికే వాదనలు జరగ్గా.. ప్రభుత్వ ఆర్డర్స్పై న్యాయస్థానం స్టే విధించింది

కాగా ‘కాంతార: ఏ లెజెండ్’ మూవీ గతంలో వచ్చిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్ అనే విషయం తెలిసిందే. 2022లో ప్రాంతీయ మూవీ వచ్చిన కాంతార ఊహించని విజయం సాధించింది. మొదట కన్నడలో మాత్రమే విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇరత భాషల్లోనూ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లోనూ విడుదల చేశారు. ఇతర భాషల్లోనూ కాంతార మూవీకి ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రానికి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.

Advertisement

Also Read: Allu Arjun-Rajamouli: అల్లు అర్జున్‌-రాజమౌళి కాంబోలో భారీ ప్రాజెక్ట్‌.. వరల్డ్సన్సేషన్పక్కా!

రూ. 16 కోట్లు @రూ. 400 కోట్లు వసూళ్లు

దీంతో కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్ గా రూ. 400 పైగా కోట్లు గ్రాస్ వసూళ్లు చేసి మేకర్స్ రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది. మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ దీనికి ప్రీక్వెల్ తీసుకురావాలి ప్లాన్ చేశారు. కన్నడలోని పంజుర్లీ సంస్క్రతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ రిషబ్ శెట్టి కాంతారను రూపుదిద్దారు. విలేజ్ బ్యాక్డ్రాప్.. కల్చరల్ బ్యాక్ డ్రాప్ లో ఉండటంతో ఈ చిత్రం ఆడియన్స్ని ఆకట్టుకుంది. దీంతో పంజుర్లీ సంస్క్రతి ఎలా పుట్టింతో చెబుతూ దీనికి ప్రీక్వెల్ కాంతార: ఏ లెజెండ్ చాప్టర్ 1 పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు.  దసరా పండుగ కానుకగా.. అక్టోబర్ 2న ఈ సినిమా వరల్డ్ వైడ్ విడుదల కానుంది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×