E-Paper
Advertisement

Devara 2 Shooting Update: దేవర 2 షూటింగ్ షురూ.. కిక్ ఇచ్చే మరో న్యూస్!

Devara 2 Shooting Update: దేవర 2 షూటింగ్ షురూ.. కిక్ ఇచ్చే మరో న్యూస్!
Advertisement

Devara 2 Shooting Update:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంత చేసుకున్న ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం ప్రశాంత్ నీళ్ (Prashanth neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో వేగంగా పాల్గొంటున్న ఆయన…మరొకవైపు దేవర 2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత చేసిన చిత్రం ‘దేవర’ మొదట మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. కాలక్రమేనా 500 కోట్ల క్లబ్లో చేరి.. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది . ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ పై అప్పట్లోనే క్లారిటీ ఇచ్చినా.. చాలా మంది అభిమానులు పెదవి విరిచారు.

సెట్ పైకి దేవర 2.. షూటింగ్ అప్పుడే..

అసలే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న చిత్రానికి మళ్లీ సీక్వెల్ అవసరమా అనే కామెంట్లు గుప్పించారు. కానీ కొరటాల శివ మాత్రం అంతకుమించి ఈ సినిమా ఉంటుంది.. పుష్ప 2 రేంజ్ లో దేవర 2 సినిమాను తెరకెక్కిస్తామని హామీ ఇచ్చారు.. ఇక అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా షూటింగుకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే గతంలో నిర్మాత చెప్పినట్లుగానే ఇప్పుడు షూటింగ్ అప్డేట్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కొరటాల శివ , ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న దేవర 2 సినిమా సీక్వెల్ మే నెల నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు అభిమానులు కూడా కొరటాల శివ హామీ ఇచ్చినట్టుగా అంతకుమించి ఏదైనా తీర్చిదిద్దుతారేమో అని చూస్తున్నారు. మరి మేలో సెట్ పైకి వెళ్ళబోయే ఈ సినిమా ఆ తర్వాత ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇకపోతే ఇందులో అందాల తార జాన్వీ కపూర్ (Janhvi Kapoor ) హీరోయిన్గా నటిస్తోంది.

Advertisement

ALSO READ:Rashmi Gautam: ఇండస్ట్రీకి రాకముందు అలాంటి వ్యాపారం.. తొలి సంపాదనపై రష్మీ కన్నీళ్లు!

ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ అప్డేట్..

ఇక ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా విషయానికి వస్తే.. ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాను 2027లో థియేటర్లలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తోంది ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇటీవల జోర్డాన్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అలా జోర్డాన్ లో షెడ్యూల్ పూర్తి చేసుకోగా ..అందులో ఎన్టీఆర్ , టోవినో థామస్ మధ్య కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం . ఇక హైదరాబాదు శివారులలో ఒక ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా కోసం మూడు పెద్ద సెట్స్ క్రియేట్ చేసి.. కొత్త షెడ్యూల్ ను ఈ వారం ఆఖరిలో ప్రారంభించబోతున్నారట. ఇక్కడ షూటింగ్ పూర్తి అయిన వెంటనే శ్రీలంక వెళ్ళనున్నట్లు సమాచారం.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×