E-Paper
Advertisement

లెజెండ్రీ సింగర్ ఆశా భోస్లేకి గుండెపోటు.. గోప్యత కోరిన మనవరాలు!

లెజెండ్రీ సింగర్ ఆశా భోస్లేకి గుండెపోటు.. గోప్యత కోరిన మనవరాలు!
Advertisement

Singer Asha Bhosle: చిత్ర సీమలో వేల సంఖ్యలో పాటలు పాడి తన గాత్రంతో శ్రోతలను అలరించిన లెజెండ్ సింగర్ ఆశాభోస్లే గుండెపోటుకి గురయ్యి.. హాస్పిటల్లో చేరారు. కొద్దిసేపటి క్రితం ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం హాస్పిటల్ అత్యవసర వైద్య విభాగంలో ఆశాభోస్లే చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఇకపోతే ఆశాభోస్లేకి గుండెపోటు అంటూ అటు న్యూస్ ఛానల్స్ లో ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈమె మనవరాలు జానై భోస్లే గోప్యత కోరుతూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది . మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఆశాభోస్లేకి గుండెపోటు..

గుండెపోటుతో హాస్పిటల్లో చేరిన ఆశాభోస్లే ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన హాస్పిటల్ వైద్యుడు ప్రతిత్ సమ్దాని ఈ విషయంపై మాట్లాడుతూ.. “ఆశాభోస్లేకి గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నాము. త్వరలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి పై మరిన్ని వివరాలు వెల్లడిస్తాము” అంటూ తెలిపారు. ఇకపోతే తమ అభిమాన గాయకురాలికి గుండెపోటు వచ్చిందని తెలియడంతో అటు ప్రముఖులు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు..

గోప్యత కావాలంటున్న ఆశా భోస్లే మనవరాలు..

Advertisement

ఇకపోతే ఆశా భోస్లే ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలకు గాయని మనవరాలు జానై భోస్లే ఇంస్టాగ్రామ్ వేదికగా.. తన అమ్మమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఒక అప్డేట్ పంచుకున్నారు. “మా అమ్మమ్మ ఆశా భోస్లే తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్లో చేరారు. దయచేసి మా గోప్యతను గౌరవించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఆమె త్వరగా కోలుకొని బయటకు వస్తుందని ఆశిస్తున్నాము. మేము త్వరలోనే మీకు సానుకూల సమాచారాన్ని అందజేస్తాము..” అంటూ ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆశా భోస్లే మనవరాలు ఇచ్చిన ఈ సమాచారంతో ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు త్వరగా ఆశాభోస్లే కోలుకోవాలి అంటూ ప్రార్థిస్తున్నారు.

70 ఏళ్ల కెరియర్ లో 12 వేలకు పైగా పాటలు..

ఆశాభోస్లే భారతీయ సంగీత రంగంలో అత్యంత గొప్ప, బహుముఖ ప్రతిభ కలిగిన గాయకులలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. దాదాపు 70 ఏళ్లకు పైగా సాగిన ఈమె కెరియర్లో అనేక భాషల్లో విభిన్న శైలిలో వేలాది పాటలు పాడి శ్రోతలను అలరించారు. ముఖ్యంగా ఈమె గాత్రం భారతీయ సంగీతానికి ప్రత్యేక గుర్తింపును అందించింది. ఇక ఈమె కెరియర్ విషయానికొస్తే.. 1943లో వచ్చిన మరాఠీ చిత్రం ‘మాజాబాల్’ అనే చిత్రంలో పాట పాడి తొలిసారి వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 1948లో హిందీ చిత్రమైన ‘చునారియా’ లో “సావన్ ఆయా” పాటతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన ఈమె.. గానంతోనే కాదు నటనలో కూడా తన ప్రతిభను చూపించారు.

గాయని మాత్రమే కాదు నటి కూడా..

Advertisement

2013లో వచ్చిన మరాఠీ చిత్రం ‘మై’ లో నటిగా అరంగేట్రం చేశారు. అంతేకాదు వంటకాలలో కూడా ఈమెకు మంచి ఆసక్తి ఉంది . దుబాయ్, కువైట్ వంటి ప్రాంతాలలో ఆశాభోస్లే పేరుతో కొన్ని ఫుడ్ రెస్టారెంట్లు కూడా ఉండడం విశేషం. దేశీ విదేశీ భాషల్లో మొత్తం 20కి పైగా భాషల్లో పాటలు పాడిన ఈమె.. 2006లో 12 వేల పంటలు పాడినట్లు స్వయంగా తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం 92 సంవత్సరాల వయసులో గుండెపోటుకు గురవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

also read:ఘనంగా బొమ్మరిల్లు కిరణ్మయి కూతురి పెళ్లి.. ఆకట్టుకుంటున్న ఫోటోలు!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×