E-Paper
Advertisement

బ్లాక్ ఫారెస్ట్ లో మహేష్ ప్రత్యేక శిక్షణ.. ఎందుకంటే?

బ్లాక్ ఫారెస్ట్ లో మహేష్ ప్రత్యేక శిక్షణ.. ఎందుకంటే?
Advertisement

Mahesh Babu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం పాన్ వరల్డ్ నేపథ్యంలో వారణాసి టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దిగ్గజ నటుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టు గత కొన్ని నెలలుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఇటీవలే కీలక షెడ్యూలు కూడా పూర్తి చేసుకోగా.. ఆ వెంటనే మహేష్ బాబు జర్మనీకి వెళ్లిపోయిన విషయం కూడా అందరికీ తెలిసిందే.

బ్లాక్ ఫారెస్ట్ లో మహేష్ బాబు ప్రత్యేక శిక్షణ..

ఇకపోతే సాధారణంగా కాస్త సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళిపోయే మహేష్ బాబు.. ఈసారి కూడా అలా సమ్మర్ హాలిడేస్ కోసం ఫ్యామిలీని తీసుకొని జర్మనీకి వెళ్లిపోయారని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం ఫిలిం వర్గాలలో చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు మహేష్ బాబు సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లో ఉన్నారు. అక్కడ ఆయన ఫిట్నెస్, వెల్నెస్ నిపుణులు డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో ట్రెక్కింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు మహేష్ బాబు. అయితే ఇదంతా సినిమాలో భాగంగానే ఆయన ఈ కష్టమైన ట్రైనింగ్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ పంచుకున్న ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ALSO READ:ఆయన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను..తిమ్మరాజుపల్లి టీవీ నటుడు ఎమోషనల్!

ప్రపంచంతో పాటు కాలాన్ని చుట్టేసే సాహసికుడుగా..

ప్రపంచంతో పాటు కాలాన్ని కూడా చుట్టేసే సాహసికుడు కథతో యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో ట్రెక్కింగ్ తో కూడిన యాక్షన్ సీన్స్ సైతం ఉండనున్నట్లు తాజాగా మహేష్ బాబు షేర్ చేసిన ఫోటోలు చూస్తే తెలుస్తోంది. అందుకే ఇప్పుడు మహేష్ బాబు ఇలా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గత ఏడాది సినిమా నుండి విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసాయి. ఈ సినిమాలో రుద్ర, శ్రీరాముడిగా మహేష్ బాబు కనిపించనున్నారు. ఇక అలాగే బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా మందాకిని పాత్ర పోషిస్తూ ఉండగా.. మలయాళీ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ తిరిగి జూన్లో మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అనగా 2027 ఏప్రిల్ 7న థియేటర్లలోకి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇక భారీ అంచనాల మధ్య ఊహకు కూడా అందని కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రాజమౌళి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×