E-Paper
Advertisement

Varanasi film: వారణాసి షూటింగ్ అప్డేట్.. రామాయణం ఎపిసోడ్ పై క్లారిటీ.. స్పీడ్ మీదున్న జక్కన్న!

Varanasi film: వారణాసి షూటింగ్ అప్డేట్.. రామాయణం ఎపిసోడ్ పై క్లారిటీ.. స్పీడ్ మీదున్న జక్కన్న!
Advertisement

Varanasi film: ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వారణాసి(Varanasi). ఈ సినిమా గత ఏడాది షూటింగ్ పనులను ప్రారంభించింది. ఇక రాజమౌళి సినిమా అంటే మినిమం మూడు నాలుగు సంవత్సరాలు సమయం పడుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ వారణాసి సినిమా విషయంలో మాత్రం జక్కన్న ఫుల్ స్పీడ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాని 2027 ఏప్రిల్ ఏడో తేదీ గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షూటింగ్ పనులను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులో ఓ షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది.

50 శాతం షూటింగ్ పూర్తి..

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజ మౌళి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ సినిమా కాదని ఈ సినిమా మైథాలజీ సినిమాగా రాబోతుందని తెలియజేశారు. అదేవిధంగా ఈ సినిమా షూటింగ్ గురించి కూడా జక్కన్న అప్డేట్ ఇవ్వడంతో మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా దాదాపు 50% షూటింగ్ పూర్తి అయిందని రాజమౌళి తెలియచేశారు.

2026 జూన్ నాటికి షూటింగ్ పూర్తి ..

Advertisement

షూటింగ్లో భాగంగానే రామాయణ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిందని కేవలం 50% షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. ఈ సినిమా షూటింగా 2026 జూన్ నాటికి పూర్తి అవుతుంది అంటూ రాజమౌళి తెలియచేయడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏడాదిలోపే రాజమౌళి గ్లోబల్ స్థాయిలో రిలీజ్ కాబోతున్న సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు అంటే మామూలు విషయం కాదు వారణాసి విషయంలో రాజమౌళి చాలా స్పీడున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అలాగే రాముడి పాత్రలో కూడా కనిపించబోతున్నారు. మహేష్ బాబుకు జోడిగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

ప్రమోషన్లకే 200 కోట్లు..

Advertisement

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి తదితరులు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా 2027 ఏప్రిల్ ఏడో తేదీ గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రాజమౌళి ఇప్పటినుంచి ఆ దిశగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేస్తున్నారు. ఇక ఈ సినిమాకు కే ఎల్ నారాయణ, ఎస్ ఎస్ కార్తికేయ నిర్మాతలుగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఏకంగా 1300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని బడ్జెట్ కాకుండా అదనంగా 200 కోట్లు కేవలం ప్రమోషన్లకు మాత్రమే కేటాయించారని తెలుస్తుంది. రాజమౌళి కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read: Don 3 : డాన్ 3 లో హృతిక్ రోషన్ లేనట్టేనా.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన హీరో?

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×