E-Paper
Advertisement

Athadu Movie:మళ్లీ రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న అతడు మూవీ.. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికేనా?

Athadu Movie:మళ్లీ రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న అతడు మూవీ.. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికేనా?
Advertisement

Athadu Movie:ఈమధ్యకాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ చిత్రాల హవా భారీగా పెరిగిపోయింది. సెలబ్రిటీలకు సంబంధించిన ప్రత్యేకమైన రోజులలో.. తమ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలను అలాగే కల్ట్ క్లాసిక్ గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసి నిర్మాతలు లాభపడుతున్న విషయం తెలిసిందే ..ప్రస్తుత కాలంలో ట్రెండు మారింది. ప్రేక్షకుల అభిరుచులు కూడా మారిపోయాయి. అలా ఒకప్పుడు థియేటర్లో డిజాస్టర్ గా నిలిచిన చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో , టీవీలలోకి వచ్చి సందడి చేస్తుంటే.. అలాంటి చిత్రాలను మళ్లీ 4k వెర్షన్ లో రీ రిలీజ్ చేస్తూ నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఒక సినిమా ఏడాదిలో రెండుసార్లు విడుదల అవుతుండడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి ఆ చిత్రం ఏంటి? ఎందుకు మళ్ళీ రీ రిలీజ్ అవుతోంది ?అనే విషయం ఇప్పుడు చూద్దాం.

గత ఏడాది రీ రిలీజ్ అయిన అతడు మూవీ?

అసలు విషయంలోకి వెళ్తే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో జయభేరి ఆర్ట్స్ పతాకంపై మురళీమోహన్ సమర్పకుడిగా డి. కిషోర్, ఎమ్.రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.. 2005లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. కానీ టీవీలోకి వచ్చిన తర్వాత మంచి విజయం అందుకుంది. అయితే అలాంటి ఈ సినిమా గత ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అయింది. వాస్తవానికి టెలివిజన్లో అత్యధిక సార్లు టెలికాస్ట్ అయిన మూవీగా ‘అతడు’ సినిమా మంచు రికార్డు దక్కించుకుంది.. అలాగే ఈ సినిమాకి సోషల్ మీడియాలో కూడా మంచి బజ్ ఏర్పడడంతో రీ రిలీజ్ లో కూడా మంచి రెస్పాన్స్ ఉంటుందని భావించిన బయ్యర్లు భారీ రేటుకు ఈ సినిమా 4కె రీ రిలీజ్ హక్కులు దక్కించుకొని భారీగా విడుదల చేశారు.

ఏడాదిలోపే మళ్లీ రీ రిలీజ్ అవుతున్న అతడు..

Advertisement

అలా ఈ సినిమా రైట్స్ రూ.3.2 కోట్ల కొనుగోలు చేయగా.. ఓవరాల్ గా ఈ సినిమా రికవరీ చేయాలి అంటే రూ.3.5 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే గత ఏడాది ఉన్న సోషల్ మీడియా బజ్ తో సినిమాకి మంచి లాభాలు వస్తాయని బయ్యర్స్ ఆశించారు. కానీ అనుకున్నంత స్థాయిలో వర్కౌట్ కాలేదు. రీ రిలీజ్ లో రెస్పాన్స్ రాకపోవడంతో కొన్న ధరకు వర్క్ అవుట్ కాక ఏకంగా కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లింది. దీంతో బయ్యర్లు కూడా నిరాశ వ్యక్తం చేశారు అయితే ఇక్కడ బయ్యర్లకు ఊరట కలిగించే అంశం ఏమిటంటే.. ఒకసారి రీ రిలీజ్ హక్కులు కొనుగోలు చేస్తే ఏడాది వరకు ఉంటాయి.

also read:GunaSekhar: క్షమాపణలు చెప్పిన ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్.. ఏమైందంటే?

అసలు కారణం ఏంటంటే?

Advertisement

ఒకవేళ రీ రిలీజ్ లో బయ్యర్లకు నష్టం జరిగితే ఆ నష్టాన్ని మళ్ళీ పూడ్చుకోవడానికి ఏడాదిలోపు ఆ చిత్రాలను మళ్ళీ రీ రిలీజ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నమాట. అంటే ఇది బయ్యర్లకు కాంపెన్సేషన్ లాగానే చెప్పుకోవచ్చు. అంటే ఏడాదిలోపు మళ్లీ రిలీజ్ చేసుకోవచ్చన్నమాట. అలా గత ఏడాది రిలీజ్ చేసి నష్టాన్ని చవిచూసిన బయ్యర్లు.. ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు అన్నమాట. అలా ఈనెల 28వ తేదీన ఈ సినిమాను సూపర్ 4K వెర్షన్ లో రీ రిలీజ్ చేయనన్నారు. మొత్తానికైతే మళ్లీ రీ రిలీజ్ చేస్తున్న మేకర్స్ కి కనీసం ఇప్పుడైనా లాభం చేకూరుతుందేమో చూడాలి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×