E-Paper
Advertisement

Mani Ratnam : ఆ టాలెంటెడ్ హీరోను పక్కన పెట్టేసిన లవ్ గురు

Mani Ratnam : ఆ టాలెంటెడ్ హీరోను పక్కన పెట్టేసిన లవ్ గురు
Advertisement

Mani Ratnam : దర్శకుడు మణిరత్నం గురించి అందరికీ విధితమే. ఒక లవ్ స్టోరీ ని అందంగా అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించడంలో మణిరత్నం ను మించిన దర్శకుడు లేరు అనడం కూడా అతిశయోక్తి లేదు. ఒకప్పుడు మణిరత్నం సినిమా అంటేనే విపరీతమైన హై ఎక్స్పెక్టేషన్ ఉండేవి. ఈ మధ్యకాలంలో ఆ హై ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్ గా తగ్గిపోయాయి.

రీసెంట్ గా మణిరత్నం నుంచి వచ్చిన సినిమా థగ్ లైఫ్. కమలహాసన్ హీరోగా నటించారు. నాయకుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంటేనే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ అంచనాలను కనీసం అందుకోలేకపోయింది ఈ సినిమా. ఈ సినిమాలో శింబు ఒక కీలక పాత్రలో కనిపించారు.

Advertisement

ఆ హీరో ని పక్కన పెట్టేశారు 

ముందుగా చిన్న చిన్న పాత్రల్లో కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు నవీన్ పోలిశెట్టి. తర్వాత కొంతకాలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో బాక్సాఫీస్ కి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన జాతి రత్నాలు సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక లాస్ట్ ఫిలిం మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. నవీన్ పోలిశెట్టి హీరోగా మణిరత్నం దర్శకుడుగా తెలుగులో స్ట్రైట్ ఫిలిం చేస్తారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సినిమాను శింబు హీరోగా తమిళ్లో చేస్తారు అంటూ తెలిపారు. ప్రస్తుతం ఆ సినిమా నవీన్ పోలిశెట్టి చెయ్యట్లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

నవీన్ పోలిశెట్టి ప్లేస్ లో ఆ యంగ్ హీరో 

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన మహాన్ సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు ధ్రవ్ విక్రమ్. తండ్రి కొడుకులు నటించిన ఆ సినిమా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఆ సినిమాకి ఇప్పటికీ మంచి ప్రశంసలు దక్కుతుంటాయి. అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్లో ఆదిత్య వర్మ పేరుతో చేశాడు ధ్రవ్ విక్రమ్. ఇక ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో బైసన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే మణిరత్నం దర్శకత్వంలో ధ్రవ్ విక్రమ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. థగ్ లైఫ్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు కాబట్టి శింబు కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా ధ్రవ్ విక్రమ్ చేయనున్నాడు.

Also Read: C Kalyan: నిర్మాత విశ్వప్రసాద్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు – సి కళ్యాణ్

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×