E-Paper
Advertisement

Bollywood: సినీ నటి కారు ధ్వంసం.. పోలీసులు పట్టించుకోలేదంటూ నటి ఆవేదన!

Bollywood: సినీ నటి కారు ధ్వంసం.. పోలీసులు పట్టించుకోలేదంటూ నటి ఆవేదన!
Advertisement

Bollywood:సినీ నటీనటులకు అప్పుడప్పుడు ఎదురయ్యే పరిణామాలు అటు సినీ సెలబ్రిటీలనే కాదు ఇటు అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక బాలీవుడ్ నటి కారు ధ్వంసం చేయడంతో అసురక్షితంగా భావించాను అంటూ నటి ఆవేదన వ్యక్తం చేసింది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

నటి కారును ధ్వంసం చేసిన నిరసనకారులు..

Advertisement

అసలు విషయంలోకి వెళితే.. ‘ది కపిల్ శర్మ షో’ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సుమోనా చక్రవర్తి (Sumona Chakravarti) కారుపై కొంతమంది నిరసనకారులు దాడి చేశారు. దక్షిణ ముంబైలో మనోజ్ జరంజే.. మరాఠా రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం సోమవారం పెద్ద ఎత్తున జరిగింది. అటుగా వెళుతున్న నటి సుమోనా చక్రవర్తి కారుపై మరాఠా రిజర్వేషన్ నిరసనకారులు దాడి చేయడంతో ఆ సంఘటన ఆమెకు అసురక్షిత భావన కలిగించింది అని, ఇంత పెద్ద సంఘటన అక్కడ జరుగుతుంటే ఆదుకోవడానికి పోలీసులు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేసింది నటి..

సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నటి..

Advertisement

సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు సుమోనా చక్రవర్తి కొలాబా నుండి ఫోర్ట్ కు ప్రయాణిస్తుండగా మరాఠా ఆందోళనకారులు ఆమె కారును చుట్టుముట్టారట. ఈ విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా వ్యక్తం చేసింది. అయితే పోస్ట్ పెట్టిన క్షణంలోనే అది వైరల్ అవ్వడంతో వెంటనే ఆమె దానిని డిలీట్ చేసింది కూడా.. మరి డిలీట్ చేసిన ఆ పోస్టులో ఆమె ఏం షేర్ చేసింది అనే విషయానికి వస్తే.. “ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నేను కొలాబా నుండి ఫోర్ట్ కి కారులో వెళ్తున్నాను. అకస్మాత్తుగా నా కారును ఒక గుంపు అడ్డుకుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి, అతని స్నేహితులు నా కిటికీలను కొడుతూ జై మహారాష్ట్ర అంటూ అరుస్తున్నారు. నేను కొంచెం ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినా మళ్లీ మళ్లీ నా కారును వెంబడించారు.

దక్షిణ ముంబైలో మొదటిసారి అలాంటి భావన కలిగింది…

ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు నా కారుపై దాడి చేశారు.. దక్షిణ బొంబాయిలో పట్టపగలు నా కారులో నేను మాత్రమే ఉన్నాను. ఆ అరుపులు దాడి కారణంగా అసురక్షితంగా భావించాను. ముఖ్యంగా నిరసనకారులు.. రోడ్లపై అరటి తొక్కలు, ప్లాస్టిక్ సీసాలు, మురికితో రహదారులను ముంచేశారు. అక్కడే తినడం, నిద్రపోవడం, స్నానం చేయడం, మూత్ర విసర్జన, మలమూత్రాలు చేయడం, వంట చేయడం, వీడియో కాలింగ్, రీల్స్ ఇలా నిరసన పేరుతో ముంబైను అలా మార్చడం పౌర జ్ఞానాన్ని పూర్తిగా అపహాస్యం చేయడమే. నేను నా పుట్టుకతోనే ఇక్కడి నుంచే జీవితాన్ని కొనసాగించాను. కానీ ఎప్పుడూ కూడా అసురక్షితంగా భావించలేదు. ముఖ్యంగా దక్షిణ ముంబైలో మొదటి సారి సురక్షితంగా లేను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ALSO READ:HBD Pawan Kalyan: అయిష్టంతో ఇండస్ట్రీలోకి.. ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×