Mirzapur Movie: డిజిటల్ ప్లాట్ఫారమ్లో సంచలనం సృష్టించిన మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ (Mirzapur) ఇప్పుడు థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ కల్ట్ క్రైమ్ డ్రామాను వెండితెరపైకి తీసుకువస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన మోస్ట్ అవేటెడ్ టీజర్ రేపు (గురువారం) విడుదల కానుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read also-“మెగాస్టార్” మెచ్చిన “న్యూ ఏజ్ మెగాస్టార్”.. రామ్ చరణ్పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!
ఓటీటీలో మూడు సీజన్ల పాటు రికార్డు స్థాయి వ్యూస్తో దూసుకుపోయిన ‘మీర్జాపూర్’.. ఇప్పుడు అంతకు మించిన హై వోల్టేజ్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్, మరియు గ్రిప్పింగ్ డ్రామాతో సినిమా రూపంలో రాబోతోంది. లార్జర్-ద్యాన్-లైఫ్ విజువల్స్తో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో ప్లాన్ చేశారు. అదే కాస్ట్.. కొత్త రేంజ్.. కాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డు పండిట్గా అలీ ఫజల్, మరియు మున్నా భయ్యాగా దివ్యేందు శర్మ వంటి పవర్ఫుల్ పాత్రలు మళ్లీ థియేటర్లలో అలరించబోతున్నట్లు టాక్. వెండితెరపై మీర్జాపూర్ గ్యాంగ్స్టర్ల ప్రపంచాన్ని మరింత పవర్ఫుల్గా చూపించనున్నారు. రేపు విడుదల కాబోయే టీజర్తో ఈ సినిమా కథాంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఓటీటీ ప్రపంచాన్ని శాసించిన కాలీన్ భయ్యా, గుడ్డు పండిట్లు.. ఇప్పుడు బాక్సాఫీస్ను ఎలా షేక్ చేస్తారో చూడాలి!
Read also-Telugu Serials : సీరియల్స్ లలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బెంగాలీ హీరోయిన్లు..