Drishyam 3:మలయాళ చిత్ర పరిశ్రమలో ఒరిజినల్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చి.. మిగతా భాషలలో రీమేక్ అయ్యి అన్ని భాషలలో కూడా సక్సెస్ ఫుల్ గా కలెక్షన్లు వసూలు చేసి రికార్డులు సృష్టించిన చిత్రం దృశ్యం. ఇక ఈ సిరీస్ కి ఉన్న క్రేజ్ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ , మీనా జంటగా వచ్చిన మొదటి రెండు భాగాలు భాషతో సంబంధం లేకుండా అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. హిందీ, తెలుగు వంటి భాషలలో రీమేక్ అయ్యి మంచి రికార్డులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు రాబోయే మూడవ భాగం కోసం పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా విడుదలకు ముందే చట్టపరమైన చిక్కుల్లో పడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఈ సినిమాను నిర్మిస్తున్న ఆశీర్వాద్ సినిమాస్ గతంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ తో కుదుర్చుకున్న డిజిటల్ డీల్ ను రద్దు చేసింది. దీంతో అమెజాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. డిజిటల్ సంస్థకు అనుకూలంగా కీలక తీర్పునిస్తూ మే 15వ తేదీ వరకు దృశ్యం 3 సినిమాకు సంబంధించిన ఎటువంటి కొత్త డీల్స్ ను కుదుర్చుకోవడానికి వీలు లేకుండా నిర్మాతలకు స్టే ఆర్డర్ జారీ చేసింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని మే 21న విడుదల చేయాలని విశ్లేషకులు భావించిన ఈ కోర్టు తీర్పు వల్ల వాయిదా పడుతుందనే కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అయితే తాజాగా ఈ విషయాన్ని మీనా ప్రస్తావిస్తూ గేమ్ ఇంకా పూర్తి కాలేదు అంటూ దృశ్యం రిలీజ్ డేట్ ను ప్రకటించింది. దృశ్యం 3 పోస్టర్ ను పంచుకుంటూ..” గేమ్ ఇంకా పూర్తి కాలేదు. ప్రపంచవ్యాప్తంగా మే 21న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది” అంటూ మీనా స్పష్టం చేసింది. మొత్తానికైతే ఈ సినిమా మే 21న థియేటర్లలోకి రాబోతుండడంతో లీగల్ ఇష్యూ సమస్యకి పరిష్కారం దొరికిందా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
ఇకపోతే అందరినీ ఆశ్చర్యపరిచే అంశం మరోటి ఏమిటంటే.. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా.. గల్ఫ్ దేశాలలో నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా మే 21కి వాయిదా వేశారు. విడుదల తేదీకి కేవలం మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు ఒక అప్డేట్ కూడా ఇవ్వకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. సాధారణంగా భారీ చిత్రాలకు నెలల ముందే ప్రమోషన్స్ మొదలుపెడతారు. అలాంటిది దృశ్యం ఫ్రాంచైజీలో వస్తున్న మూడవ చిత్రం అభిమానులలో అంచనాలు పెంచుకుంది.
ALSO READ:Bigg Boss 10: బిగ్ బాస్ 10లోకి ఇద్దరు టాప్ సెలబ్రిటీస్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?
ఇలాంటి సమయంలో ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది . ఇకపోతే కేవలం ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ పైనే ఆధారపడడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ దెబ్బ తినే అవకాశం కూడా ఉందని ట్రేడ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాలోని సస్పెన్షన్ కాపాడడం కోసమే మేకర్స్ ఇలా కంటెంట్ ను బయట పెట్టడం లేదా అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.. మరి ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.