E-Paper
Advertisement

Naga Vamsi: అన్నిట్లో వేలు పెట్టొద్దు…త్రివిక్రమ్ ఇచ్చిన సలహా ఇదే..

Naga Vamsi: అన్నిట్లో వేలు పెట్టొద్దు…త్రివిక్రమ్ ఇచ్చిన సలహా ఇదే..
Advertisement

Naga Vamsi: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ(Naga Vamsi) ఒకరు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే 2025లో ఈయన భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు కానీ ఏ ఒక్కటి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇలా ఈయన నిర్మాతగా మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన సినిమాలు కూడా నష్టాలను మిగిల్చాయి. ఇలా వరుస ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న నాగవంశీ కొత్త ఏడాది మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

క్లాస్ పీకిన త్రివిక్రమ్..

సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగ వంశీ నిర్మాణంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన అనగనగా ఒక రాజు(Anaganaga oka Raju) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో నాగ వంశీ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో భాగంగా సినిమాల విషయంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనుకు ఇచ్చిన సలహాలు గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.

ఫ్యామిలీ జానెర్ సినిమాలు..

Advertisement

2025 సెకండ్ హాఫ్ నుంచి నా సినీ కెరియర్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని నాగ వంశీ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ గారు నాతో మాట్లాడుతూ నువ్వు అన్నింట్లోనూ వేలు పెట్టొద్దు. మన బలాన్ని (ఫ్యామిలీ జానెర్) మనం నమ్ముకుందాం అంటూ ఆయన నాకు సలహా ఇచ్చారు. నాగ వంశీ నిర్మాణంలో సినిమా వస్తుంది అంటే అందరూ చూసే విధంగా ఆ సినిమా ఉంటుంది అనే నమ్మకాన్ని తీసుకు వద్దాం .ఇకపై మనం చేయబోయే సినిమాలన్నీ కూడా ఇలా ఫ్యామిలీ జానెర్ లోనే ఉండేలా చూసుకుందాం కానీ ప్రతిదాంట్లో నువ్వు వేలు పెట్టొద్దు అంటూ బాగా క్లాస్ పీకారని నాగ వంశీ ఈ సందర్భంగా తెలియజేశారు.

సంక్రాంతి బరిలో నవీన్ పోలిశెట్టి..

Advertisement

ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా అంటేనే కచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇటీవల శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సాయి సౌజన్య నాగ వంశీ సంయుక్తంగా పలు సినిమాలను నిర్మించారు. అనగనగా ఒక రోజు సినిమాకు కూడా నాగ వంశీ సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. ఈ సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ద్వారా మరో హిట్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది.

Also Read: Spirit First Look: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ…స్పిరిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×