E-Paper
Advertisement

సెన్సార్ పూర్తి చేసుకున్న నిహారిక ‘రాకాస’ .. రన్ టైం ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న నిహారిక ‘రాకాస’ .. రన్ టైం ఎంతంటే?
Advertisement

Raakaasa: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన వెబ్ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి నిర్మాతగా సక్సెస్ అయ్యారు. ఇక నిహారిక ప్రస్తుతం సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కమిటీ కుర్రోళ్ళు సినిమాతో సక్సెస్ అందుకున్న నిహారిక త్వరలోనే రాకాస(Raakaasa) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ మూడో తేదీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా గట్టిగా నిర్వహిస్తున్నారు.

133:00 నిమిషాల రన్ టైం లాక్..

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిహారిక (Niharika) సైతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమా మరొక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో విడుదలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంది ఇక తాజాగా సెన్సార్ బోర్డ్ ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసిన సంగతి తెలిసిందే .అలాగే ఈ సినిమా నిడివి కూడా సెన్సార్ బోర్డు ప్రకటించింది. ఏ విధమైనటువంటి కట్స్ లేకుండా ఈ సినిమా 133:00 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..

మానస శర్మ డైరెక్షన్ లో రాకాస..

Advertisement

ఇక ఈ సినిమా ఏప్రిల్ మూడవ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఏప్రిల్ 2 నుంచి ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫాంటసీ హర్రర్ కామెడీ నేపథ్యంలో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించగా, సంగీత్ శోభన్(Sangeeth Sobhan), నయన్ సారిక(Nayan Sarika) హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక సినిమాలో గెటప్ శ్రీను కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసాయి. మరి ఏప్రిల్ మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాకాస నిహారికకు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

అన్నయ్యతో కొత్త సినిమా ప్రకటించిన నిహారిక..

Advertisement

ఇక నిహారిక ఈ సినిమా విడుదల కాకుండానే మరో కొత్త సినిమాని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే తన మూడవ సినిమాని వరుణ్ తేజ్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే .గ్రామీణ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బరి(Bhari) అనే టైటిల్ తో వాలీబాల్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని ఇటీవల చిత్ర బృందం వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సినిమాకు కమిటీ కుర్రోళ్ళు డైరెక్టర్ యదు వంశీ దర్శకుడిగా వ్యవహరించబోతుండటం విశేషం.

Also Read: కింగ్ 100 వ సినిమా నాగ్ కీలక అప్డేట్…ఆ సెంటిమెంట్ తో హిట్ కొట్టబోతున్నాడా?

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×