E-Paper
Advertisement

Payal Rajputh: ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్… కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్

Payal Rajputh: ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్… కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్
Advertisement

Payal Rajput: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)మారుతి(Maruthi) దర్శకత్వంలో తాజాగా నటించిన చిత్రం ది రాజా సాబ్(The Raja Saab). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో పలువురు ప్రభాస్ అభిమానులు సినిమా విషయంలో నిరాశ వ్యక్తం చేస్తూ డైరెక్టర్ మారుతి పై విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరి కొంతమంది సినిమా సూపర్ హిట్ అని, ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న పాయల్..

ఇలా ప్రభాస్ లాంటి సూపర్ హీరోతో చేయాల్సిన సినిమా కాదంటూ ప్రభాస్ అభిమానులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రకాల పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నటి పాయల్ రాజ్ పుత్(Payal Raj Puth) సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా ఈమె రాజా సాబ్ సినిమా కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న ఒక వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

అన్ని రికార్డులను బ్రేక్ చేయాలి..

Advertisement

పాయల్ రాజ్ పుత్ రాజా సాబ్ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. “హాయ్ డార్లింగ్స్.. ది రాజా సాబ్ టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్.. ఈ సినిమా ఇప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేయాలి.. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి అభినందనలు “అంటూ ఒక వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఈ వీడియో పై పలువురు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈసారి గట్టిగా అనుకోండి మీకు కూడా ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం వస్తుంది.. ఇప్పుడే బాధపడకండి అంటూ ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ప్రభాస్ సినిమాలో ఛాన్స్ రాని నేపథ్యంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు అంటూ అభిమానులు విభిన్న శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రాజా సాబ్ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోవడంతో అభిమానులలో కూడా ఏదో తెలియని వెలితి ఉంది. ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం చిత్ర బృందం ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు త్వరలోనే చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.

Also Read: Allu Arjun: నాన్నే నా దేవుడు ..అల్లు అర్జున్ ఎమోషన్ పోస్ట్ వైరల్!

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×