E-Paper
Advertisement

Prasthanam Movie: అందుకు దర్శకుడు దేవ కట్టాను కొట్టబోయిన మమ్ముట్టి.. అంత పని ఏం చేశారంటే?

Prasthanam Movie: అందుకు దర్శకుడు దేవ కట్టాను కొట్టబోయిన మమ్ముట్టి.. అంత పని ఏం చేశారంటే?
Advertisement

Prasthanam Movie: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘ప్రస్థానం’ ఒక మైలురాయి వంటి సినిమా. రాజకీయ చదరంగం, కుటుంబ సంబంధాల మధ్య నలిగిపోయే పాత్రలతో దర్శకుడు దేవ కట్టా ఈ చిత్రాన్ని ఒక మాస్టర్ పీస్‌గా తీర్చిదిద్దారు. అయితే, ఈ సినిమా భాగంగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో దేవ కట్టాకు ఎదురైన ఒక చేదు అనుభవం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగింది అంటే.. మొదట ప్రస్థానం సినిమా తమిళ్ యాక్టర్ సూర్య, మమ్ముట్టితో తో తియ్యాలి అనుకున్నారట, అయితే అందులో హీరో తండ్రి పాత్రకు ముందుగా మమ్మట్టిని అనుకున్నారు. దర్శకుడు అయిన దేవ కట్టా మమ్ముట్టి దగ్గరకు వెళ్లి కథ చెప్పారట.. అయతే ఆయన ఆ కథ సరిగా అర్థం చేసుకోకపోవడంతో తనకు నచ్చలదు… అంతే కాకుండా హీరో తండ్రి పాత్రకు గత పదిహేనేళ్లుగా తన దగ్గరకు అనేక మంది వచ్చారని, ఇది కూగా అలాంటి సినిమానే అనుకుని తన వైపు సీరియస్ గా చూశారన్నారు. అంతే కాకుండా ఇదే పాత్ర కోసం నువ్వు చిరంజీవి దగ్గరకు వెళ్లి చెప్పగలవా అని అగిగారని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో అక్కడి నుంచి సైలెంట్ గా వచ్చేశారని.. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాత్రకు అవార్డు రావడంతో ఆయన ఎంతో బాధపడ్డారని దేవ కట్టా అన్నారు.

Read also-Mahesh Vanga: సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్‌తోనేనా!.. అయితే స్టోరీ ఇదే..

Advertisement

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాల్లో ‘ప్రస్థానం’ ఒక అద్భుత కావ్యం. ఈ సినిమా కేవలం ఒక రాజకీయ చిత్రం మాత్రమే కాదు, మానవ సంబంధాల మధ్య ఉండే సంక్లిష్టతలను, అధికార దాహాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన మాస్టర్ పీస్. ఈ చిత్రంలో సాయికుమార్ పోషించిన ‘లోకనాథం’ పాత్ర తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన పాత్రలలో ఒకటిగా నిలిచిపోయింది. అయితే, ఈ పాత్ర వెనుక ఒక ఆసక్తికరమైన మరియు కొంత చేదు అనుభవం దాగి ఉందని దర్శకుడు దేవ కట్టా ఇటీవల వెల్లడించారు. మొదట ‘ప్రస్థానం’ చిత్రాన్ని తమిళ నటుడు సూర్య, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కాంబినేషన్‌లో తెరకెక్కించాలని దేవ కట్టా భావించారు. ఇందులో తండ్రి పాత్ర (లోకనాథం) కోసం మమ్ముట్టిని సంప్రదించి కథ వివరించారు. అయితే, ఆ సమయంలో మమ్ముట్టి ఈ కథలోని లోతును, ఆ పాత్రలోని వైవిధ్యతను సరిగా అర్థం చేసుకోలేకపోయారు. “ఇదే కథను తీసుకుని నువ్వు చిరంజీవి దగ్గరకు వెళ్లి చెప్పగలవా?” అని ప్రశ్నించారట. ఆ మాటలతో దేవ కట్టా అక్కడి నుంచి మౌనంగా వెనుదిరిగారు.

Read also-Punarnavi Bhupalam: నిశ్చితార్థం చేసుకున్న పునర్నవి భూపాలం.. వరుడి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

Advertisement

మమ్ముట్టి వద్ద తిరస్కరణకు గురైన అదే పాత్రను సాయికుమార్ అద్భుతంగా పండించి, విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులను అందుకున్నారు. సినిమా విడుదలయ్యాక ఆ పాత్రకు వచ్చిన స్పందన చూసి మమ్ముట్టి గారు కూడా కొంత విచారం వ్యక్తం చేశారని సమాచారం. ఒక గొప్ప కథకు సరైన నటుడు దొరికినప్పుడే అది చరిత్ర సృష్టిస్తుంది. మమ్ముట్టి వంటి గొప్ప నటుడు ఆ పాత్రను వదులుకోవడం ఆయన దురదృష్టమైతే, ఆ పాత్ర ద్వారా సాయికుమార్ కి, దేవ కట్టా గారికి దక్కిన గుర్తింపు తెలుగు సినిమా గర్వించదగ్గ విషయం.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×