SKN: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జర్నలిస్టుగా కెరియర్ స్టార్ట్ చేసి నేడు నిర్మాతగా ఎదిగారు ఎస్కేఎన్. ఎస్ కే ఎన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిర్మాతగా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. కొన్ని సందర్భాలలో తను మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.
అయితే కొన్నిసార్లు తన పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎంతోమందికి నిర్మాత ఎస్కేఎన్ సాయాన్ని అందించాడు. నిర్మాతగా మంచి పేరు సంపాదించడమే కాకుండా ఒక మనిషిగా కూడా అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఉంది అని చాలామంది ఇండస్ట్రీ వర్గాల్లో అతని గురించి మాట్లాడుకుంటారు. తాజాగా మరో మహేష్ బాబు అభిమాని కుటుంబాన్ని ఆదుకున్నారు ఎస్కేఎన్.
మహేష్ బాబు అభిమాని ఒకరు చనిపోయారు. అయితే దానికి సంబంధించి మనలో ఒకడు ఈ రోజు మనల్ని వదిలివెళ్లిపోయాడు.
మహేష్ అన్న ఫ్యాన్స్ మరియు మన తెలుగు యువత అందరి హీరో ఫ్యాన్స్ అందరూ మీకు తోచినంత హెల్ప్ చేయండి. అంటూ ట్విట్టర్లో ట్వీట్ వేశారు. చాలామంది తమకు తోచిన సహాయం అందించారు.
చనిపోయిన అబ్బాయికి 10 సంవత్సరాలు కొడుకు మరియు ఆరు సంవత్సరాలు కూతురు కూడా ఉన్నారు అని నిర్మాత ఎస్ కే ఎన్ ట్యాగ్ చేసి పోస్ట్ చేశాడు రమేష్ నాయక్ అనే ఒక వ్యక్తి. దీనికి నిర్మాత ఎస్కేఎన్ వెంటనే స్పందించారు.
ఇది తెలిసిన తర్వాత చాలా బాధగా ఉంది. ఒక అభిమానిగా ఇంకొక అభిమాని ఎమోషన్ నేను అర్థం చేసుకోగలుగుతాను. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ల పిల్లలకు అది డిస్టర్బ్ కాకూడదు. నేను రెండు లక్షల రూపాయలు నా సైడ్ నుంచి వాళ్ళ చదువుల నిమిత్తం ఇస్తాను అని ట్విట్టర్ వేదికగా ప్రామిస్ చేశాడు ఎస్కేఎన్.
చెప్పిన మాదిరిగానే ఆ ఫ్యామిలీని కలిసి రెండు లక్షల రూపాయలు చెక్ అందించారు. ప్రస్తుతం ఎస్కేఎన్ చేసిన ఈ పనిని బట్టి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రశంసలు వస్తున్నాయి.
వాస్తవానికి నిర్మాత ఎస్కేఎన్ మెగా ఫ్యామిలీకి అతిపెద్ద అభిమాని. కానీ మిగతా హీరోల అభిమానులకు ప్రాబ్లం వచ్చినా కూడా సాయం చేయడానికి ముందు వరుసలో ఉంటాడు. ఇలా సాయం చేయడం అనేది మొదటిసారి కాదు. గతంలో కూడా ఎన్టీఆర్ అభిమానికి అవసరం వచ్చినప్పుడు కూడా ఇలానే నిలబడ్డాడు ఎస్కేఎన్. మెగా అభిమానులకు ఏదైనా సమస్య వచ్చినా కూడా ఇలానే నిలబడతాడు. పిఠాపురంలో ఒక ఫ్యామిలీకి ఆటోను కూడా కొనిచ్చిన సంగతి అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది.
Also Read: Upasana Konidela: పెళ్లైన 10 ఏళ్లకు పిల్లలు.. ట్రోల్స్ పై ఉపాసన ఫస్ట్ టైం రియాక్షన్