Shalini Pandey: ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నటిగా చెరగని ముద్ర వేసుకున్న భామ షాలిని పాండే (Shalini Pandey). ఈ సినిమాతో స్టార్డమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, అటు పర్ఫార్మెన్స్తో ఇటు గ్లామర్తో కుర్రకారును కట్టిపడేసింది. వెండితెరపై ఎక్కువగా పద్ధతైన పాత్రల్లో కనిపించే ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తనలోని బోల్డ్ యాంగిల్ను బయటకు తీస్తూ ఇంటర్నెట్ను షేక్ చేస్తుంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన బికినీ ఫొటోలు ఇప్పుడు నెట్టింట సెగలు రేపుతున్నాయి. షాలిని పాండే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో లేటెస్ట్ వెకేషన్ ఫోటోలను పంచుకుంది. అందులో టూ-పీస్ బికినీ ధరించి తన పర్ఫెక్ట్ ఫిగర్ను ప్రదర్శిస్తూ అభిమానులకు బిగ్ ట్రీట్ (Bikini Treat) ఇచ్చింది. తీరంలో ఎంజాయ్ చేస్తున్న ఈ ఫోటోలలో షాలిని చాలా కాన్ఫిడెంట్గా, స్టైలిష్గా కనిపిస్తోంది. ముఖ్యంగా బీచ్ ఒడ్డున సూర్యాస్తమయం వేళ ఆమె ఇచ్చిన పోజులు కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తున్నాయి.
Also Read- Tollywood: అగ్ర హీరోల చిత్రాలు లేక వెలవెలబోతున్న థియేటర్లు.. ఎగ్జిబిటర్లు ఏమంటున్నారంటే?
ఈ ఫోటోలు షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్గా మారాయి. ఆమె ఫాలోయర్స్ కామెంట్లతో చెలరేగిపోతున్నారు. ‘అర్జున్ రెడ్డి హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి?’, ‘బ్యూటీ అండ్ బోల్డ్ కాంబినేషన్’ అంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గతంలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని, ఇప్పుడు చాలా స్లిమ్గా తయారై తన మేకోవర్తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఫిట్నెస్ విషయంలో ఆమె తీసుకున్న కేర్ ఈ ఫోటోలలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటోల్లో బ్యాక్లెస్ ఫొటో కూడా బాగా వైరల్ అవుతోంది. టూ-పీస్ బికినీ ఫొటోలో ట్రెండీగా హాట్ లుక్లో షాలిని కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలకు కామెంట్స్, లైక్స్ హోరెత్తుతున్నాయి.
Also Read- Vishwaksen: అతని చేతిలో దారుణంగా మోసపోయిన విశ్వక్ సేన్.. అలా ఎలా బోల్తా పడ్డావ్ భయ్యా!
తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ‘మహానటి’, ‘118’ వంటి సినిమాల్లో నటించిన షాలిని, ఆ తర్వాత బాలీవుడ్ పై కన్నేసింది. రణవీర్ సింగ్ వంటి స్టార్ సరసన ‘జయేశ్ భాయ్ జోర్దార్’ సినిమాలో నటించినా కూడా ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. ప్రస్తుతం ఈ భామ సౌత్ అండ్ నార్త్ అని తేడా లేకుండా వరుస అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది. అయితే ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అంతగా తనకు ఏ చిత్రం హైలెట్గా నిలవలేదు. సినిమాలైతే చేసింది కానీ, అంతగా ఏది క్లిక్ కాలేదు. ఇప్పుడు అవకాశాలు కూడా తగ్గాయి. అందుకే ఇలా వరుస ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తోంది. ఈ భామ త్వరలోనే ఒక భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.
Also Read- Prabhas : జియోహాట్ స్టార్ కు బిర్యానీ ఆర్డర్లు… ప్రభాస్ ఫ్యాన్స్ అనిపించుకున్నారు కదరా బాబు!