Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా సెట్స్లో ఒక స్పెషల్ సెలబ్రేషన్ జరిగింది. చిత్ర యూనిట్ అంతా కలిసి ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా (Avinash Kolla) పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్ట్ అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ కొల్లా పుట్టినరోజు సందర్భంగా సెట్స్లో కేక్ కట్ చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్ స్వయంగా పాల్గొని అవినాష్కు శుభాకాంక్షలు తెలిపారు. చరణ్తో పాటు దర్శకుడు బుచ్చిబాబు సానా, చిత్ర బృందం మొత్తం ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read- Tollywood: అగ్ర హీరోల చిత్రాలు లేక వెలవెలబోతున్న థియేటర్లు.. ఎగ్జిబిటర్లు ఏమంటున్నారంటే?
రామ్ చరణ్ ఇటీవలే ట్విన్స్కు తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఉపాసన-చరణ్ దంపతులకు కవలలు (Mega Twins) జన్మించడంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. సాధారణంగా ఇలాంటి సంతోషం కలిగినప్పుడు ఎవరైనా కొన్ని రోజులు ఇంటికే పరిమితం అవుతారు. కానీ, రామ్ చరణ్ మాత్రం తన పని పట్ల ఉన్న నిబద్ధతను చాటుకున్నారు. ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తూనే, సినిమా షూటింగ్కు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో వెంటనే సెట్స్లోకి అడుగుపెట్టారు. ఇంటి దగ్గర చిన్నారులతో గడపాల్సిన సమయంలో కూడా సినిమా కోసం, టీమ్ కోసం ఆయన షూటింగ్కు రావడం చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ‘వర్క్ అంటే చరణ్ అన్నకు ఉన్న డెడికేషన్ వేరే లెవల్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read- Prabhas : జియోహాట్ స్టార్ కు బిర్యానీ ఆర్డర్లు… ప్రభాస్ ఫ్యాన్స్ అనిపించుకున్నారు కదరా బాబు!
భారీ బడ్జెట్తో, పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ కథ కోసం రామ్ చరణ్ సరికొత్త మేకోవర్లో కనిపిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్పై క్రేజ్ మరింత పెరిగింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి వారంతా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారనే విషయం ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.