Telugu film celebrities meeting: సినీ వర్గాల్లో ఈరోజు జరిగిన ఒక సమావేశం పెద్ద చర్చగా మారింది. అదే ఆర్ఎస్ఎస్ పెద్దల సమావేశం. ఈ సమావేశం హైదరాబాద్లోని విక్టరీ వెంకటేష్ ఇంట్లో జరగడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయిన మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశానికి ప్రముఖ సినీ నిర్మాతలు మైత్రీ రవి, సాహు తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ హీరోలు కూడా ఈ సమావేశంలో కనిపించారు. వారిలో నాగార్జున, నాని, వెంకటేష్, తేజు సజ్జా ఉన్నారు. సినీ రంగానికి చెందిన ఇంతమంది ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఈ సమావేశానికి 70 మందికి పైగా ప్రముఖులు వచ్చినట్లు తెలుస్తోంది.
సమావేశంలో ప్రధానంగా సినిమా రంగానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. ఆర్ఎస్ఎస్ పెద్దలు తమ ఆలోచనలను సినీ ప్రముఖులతో పంచుకున్నారని తెలుస్తోంది.
వెంకటేష్ ఇంట్లో ఈ సమావేశం జరగడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వెంకటేష్ కుటుంబం అందరితో బాగా కలిసి ఉండే వాళ్ళు అన్న విషయం తెలిసిందే. అందుకే ఆర్ఎస్ఎస్ పెద్దల సమావేశానికి ఆయన ఇంటిని ఎంచుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ సమావేశంపై అధికారికంగా ఎక్కువ వివరాలు బయటకు రాకపోయినా, సినీ వర్గాల్లో మాత్రం ఇది హాట్ టాపిక్గా మారింది. సినిమా ప్రముఖులు, ఆర్ఎస్ఎస్ నేతలు కలిసి ఒకే వేదికపై చర్చించడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈ సమావేశం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ALSO READ: Dhurandhar OTT : థియేటర్లో బ్లాక్ బస్టర్.. ఓటీటీలో మాత్రం మిశ్రమ స్పందన..!