E-Paper
Advertisement

Ustaad Bhagat Singh Music Update: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బీజీఎమ్‌కు థమన్ అఫీషియల్‌గా వచ్చేశాడు.. కారణం ఏంటంటే?

Ustaad Bhagat Singh Music Update: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బీజీఎమ్‌కు థమన్ అఫీషియల్‌గా వచ్చేశాడు.. కారణం ఏంటంటే?
Advertisement

Ustaad Bhagat Singh Music Update: పవన్ కళ్యాణ్ అభిమానులకు సినీ ప్రియులకు మైత్రీ మూవీ మేకర్స్ ఒక ఆసక్తికరమైన ఊహించని అప్‌డేట్‌ను అందించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంగీత విభాగంలో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ నోట్ విడుదల చేశారు నిర్మాతలు. మొదటి నుంచీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా గబ్బర్ సింగ్ కాంబినేషన్ అయిన హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ – దేవి శ్రీ ప్రసాద్ (DSP) మళ్ళీ కలిసి పనిచేస్తుండటంతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ‘దేఖలేంగే సాలా’, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ వంటి పాటలు సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టించాయి. రాక్‌స్టార్ DSP తన మార్కు సంగీతంతో అభిమానులను ఉర్రూతలూగించారు.

Read also-Ali Rumor: అలీ గాజుల వ్యాపారం గురించి తెలుసా?.. ఇది చూస్తే పడీ పడీ నవ్వుతారు..

మార్పుకు గల కారణాలు

Advertisement

సాధారణంగా ఒక సినిమాకు ఒకరే సంగీత దర్శకుడు ఉండటం ఆనవాయితీ. కానీ, ఈ సినిమా విషయంలో నిర్మాణ సంస్థ ఒక క్లిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ‘సమయపాలన’. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (నేపథ్య సంగీతం) అందించడానికి కావాల్సిన సినిమా రీల్స్‌ను సిద్ధం చేసి DSPకి పంపడంలో చిత్ర యూనిట్ వైపు నుండి కొంత ఆలస్యం జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ అప్పటికే ఒప్పుకున్న ఇతర భారీ ప్రాజెక్టుల వల్ల , ఈ సినిమా కోసం ఆయన కేటాయించిన సమయం ముగిసిపోయింది. ఆయన తన ముందస్తు కమిట్‌మెంట్స్ వల్ల ఇప్పుడు అదనపు సమయాన్ని కేటాయించలేకపోయారు. చిత్ర బృందం, DSP మధ్య చర్చలు జరిగిన తర్వాత, సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయాలనే ఉద్దేశంతో నేపథ్య సంగీతం కోసం మరొకరిని తీసుకోవాలని నిర్ణయించారు.

Read also-Dhurandhar Impact: ధురంధర్‌కి అంత సీన్ ఉందా?.. పాన్ వరల్డ్ సినిమాని పరుగెట్టించిందిగా!

థమన్ ఎంట్రీ – ఒక కొత్త కాంబినేషన్

Advertisement

ఈ నేపథ్యంలో, టాలీవుడ్‌లో నేపథ్య సంగీతానికి పెట్టింది పేరుగా ఉన్న ఎస్.ఎస్. థమన్ ఈ ప్రాజెక్ట్‌లోకి ప్రవేశించారు. ఇప్పుడు ఈ సినిమాకు ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు పని చేస్తున్నారు. పాటలు దేవి శ్రీ ప్రసాద్ అందించగా నేపథ్య సంగీతం (BGM) థమన్ అందిస్తున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే సినిమా కోసం పని చేయడం అనేది తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక అరుదైన పవర్‌ఫుల్ కలయిక. థమన్ తనదైన శైలిలో బిజీఎం ఇచ్చి సినిమా స్థాయిని పెంచుతారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేవలం సినిమా నాణ్యత తగ్గకుండా, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయడానికే ఈ మార్పు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టం చేసింది. “రెండు దిగ్గజ సంగీత శక్తుల కలయిక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను ఒక గ్రాండ్ సెలబ్రేషన్‌గా మారుస్తుంది” అని వారు పేర్కొన్నారు. అభిమానులు ఇప్పుడు DSP ఇచ్చే ఉత్సాహభరితమైన పాటలతో పాటు, థమన్ ఇచ్చే పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో ఈ మ్యూజికల్ ఫీస్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×