E-Paper
Advertisement

5 కోట్లు పెడితే రూ. 180 కోట్ల వర్షం.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మలయాళ సెన్సేషన్!

5 కోట్లు పెడితే రూ. 180 కోట్ల వర్షం.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మలయాళ సెన్సేషన్!
Advertisement

Vaazha 2: మీదగ్గర కాస్టింగ్ ఉంటె మా దగ్గర కంటెంట్ ఉందంటూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తూ మీసం మెలేస్తుంది మలయాళ చిత్ర సీమ. అవును.. భారీ బడ్జెట్ సినిమాలు, సూపర్‌స్టార్ల సపోర్ట్ లేకపోయినా కేవలం యూత్‌ఫుల్ కంటెంట్‌తో వందల కోట్ల వసూళ్లు కొల్లగొడుతూ మైండ్ బ్లాక్ చేస్తుంది.ఈ క్రమంలోనే వచ్చింది  ఏప్రిల్ 2, 2026న కేరళలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తాన్ని తనవైపు తిప్పుకుంటున్న లేటెస్ట్ సెన్సేషన్ ‘వాజా 2’ (Vaazha 2: Biopic of a Billion Bros).

మలయాళ సినీ ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ వసూళ్లు

Advertisement

మలయాళంలో ‘వాజా’ అంటే అరటి మొక్క అని అర్థం, కానీ అక్కడ పనిపాటా లేకుండా తిరిగే కుర్రాళ్లను వెక్కిరించడానికి ఈ పదాన్ని వాడుతుంటారు. సరిగ్గా అలాంటి ‘వేస్ట్’ అనిపించుకునే నలుగురు కుర్రాళ్ల కథతో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన కేవలం రెండు వారాల్లోనే మలయాళ ఇండస్ట్రీలోని టాప్ హీరోల రికార్డులను సైతం తుడిచిపెట్టేసిందంటే సినిమా ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చెప్పక్కర్లేదు.అలా ఈ సినిమా హిట్ అనే ట్యాగ్ తో సరిపెట్టుకోకుండా మలయాళ సినీ ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల జాబితాలో నిలిచి ట్రేడ్ పండిట్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది.నిజానికి ఈ సక్సెస్ స్ట్రీక్ మొదలైంది ‘వాజా: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బాయ్స్’ అనే ఫాస్ట్ పార్ట్ తో.

కేవలం పది రోజుల్లోనే వంద కోట్ల మార్కును

Advertisement

కథాపరంగా చూస్తె విష్ణు, అజు థామస్, మూస అనే ముగ్గురు స్నేహితుల అల్లరి, వారి ఇంజినీరింగ్ కాలేజీ గొడవలు, చివరికి డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం వంటి అంశాలతో తెరకెక్కించాడు డైరెక్టర్ ఆనంద్ మీనన్.కేవలం 4 కోట్ల రూపాయలతో రూపొందిన ఆ సినిమా ఫుల్ రన్‌లో 38 కోట్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఆ సక్సెస్ ఇచ్చిన ఊపుతో సావిన్ ఎస్.ఏ దర్శకత్వంలో వచ్చిన సీక్వెలే ఈ ‘వాజా 2’. హషీర్, అలన్, అజిన్, వినాయక్ అనే నలుగురు విద్యార్థుల జీవితంలో జరిగే ఆసక్తికర సంఘటనలని చూపిస్తూ రెండో భాగం తెరకెక్కించారు.ఏప్రిల్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, కేవలం పది రోజుల్లోనే వంద కోట్ల మార్కును దాటేసి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది.

ఏప్రిల్ 15 నాటికి ఏకంగా 180 కోట్ల రూపాయల గ్రాస్

కేవలం 5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా, ఏప్రిల్ 15 నాటికి ఏకంగా 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి 36 రెట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ స్థాయి వసూళ్లతో ఇప్పటివరకు మలయాళంలో టాప్-5లో ఉన్న ‘2018’ సినిమా రికార్డులను బద్ధలు కొట్టి ఆ ప్లేస్ పట్టేసింది ఈ సినిమా ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో ‘లోక చాప్టర్ 1: చంద్ర’, ‘ఎ2: ఎంపురాన్’, ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘తుడరుమ్’ వంటి భారీ చిత్రాల సరసన ఈ చిన్న సినిమా నిలవడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం.విపిన్ దాస్ కథ అందించిన ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాహు గారపాటి కూడా ఒక భాగస్వామి కావడం విశేషం

ఇపుడు అదే షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ద్వారా మరోసారి తెలుగు ఆడియన్స్ ని అలరించేందుకు సిద్దం అయిపొయింది.‘వాజా-2’ పేరుతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24, 2026న తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.చూడాలి మరి కేరళ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగు నాట ఏ మేరకి వసూళ్లు కొల్లగొడుతుందో !

also read:అడివి శేష్ ‘డెకాయిట్’కి బాక్సాఫీస్ షాక్.. 5 రోజుల్లో ఇంత దారుణమైన వసూళ్లా?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×