Vijay Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఈ ఇద్దరి పేర్లు వినపడగానే కుర్రకారులో ఒక రకమైన సందడి మొదలవుతుంది. టాలీవుడ్లో మోస్ట్ అడోరబుల్ జోడీగా పేరు తెచ్చుకున్న ఈ ‘విరోష్’ (ViRash) పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ గతంలో రష్మిక గురించి చేసిన అతి మొదటి పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ అభిమానులను అలరిస్తోంది.
Read also-Dhurandhar Impact: ధురంధర్కి అంత సీన్ ఉందా?.. పాన్ వరల్డ్ సినిమాని పరుగెట్టించిందిగా!
వీరిద్దరి కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి సినిమా ‘గీత గోవిందం’. ఈ సినిమా సెట్స్ పైనే వీరి మధ్య స్నేహం మొదలైంది. ఆ సమయంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ (X) ఖాతాలో ఒక పోస్టర్ను షేర్ చేస్తూ రష్మికను ఉద్దేశించి చేసిన కామెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ పోస్ట్లో విజయ్ ఇలా రాసుకొచ్చారు “నా కాళ్లు తిమ్మిరి ఎక్కినా.. నా నడుం నొప్పి వచ్చినా నీ బరువు బాధ్యతలు ఎప్పుడూ నావే మేడం” ఈ డైలాగ్ అప్పట్లో సినిమాపై భారీ అంచనాలను పెంచడమే కాకుండా, వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని కూడా చాటిచెప్పింది. సినిమాలో గోవిందం పాత్రలో విజయ్, గీత పాత్రలో రష్మికను తన వీపుపై ఎక్కించుకుని వెళ్లే సీన్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సీన్కు సంబంధించిన పోస్టర్ను షేర్ చేస్తూ విజయ్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలే ఇప్పుడు వారి నిజజీవిత బంధానికి సంకేతాలుగా అభిమానులు భావిస్తున్నారు.
Read also-Vijay Rashmika: తెలుగు వారికి కొత్త కోడలు వచ్చింది ఆశీర్వదించండి: విజయ్ దేవరకొండ
అభిమానులు వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ఆనాటి స్నేహం నేడు పెళ్లి పీటల వరకు రావడం విశేషం. విజయ్ ఆ పోస్ట్లో వాడిన “నీ బరువు బాధ్యతలు ఎప్పుడూ నావే” అనే మాట ఇప్పుడు నిజం కాబోతోందని, రష్మిక బాధ్యతను విజయ్ జీవితాంతం తీసుకోబోతున్నారంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘గీత గోవిందం’ తర్వాత ‘డియర్ కామ్రేడ్’లో కూడా ఈ జంట తమ నటనతో మెప్పించారు. అయితే వీరిద్దరి పెళ్లి దేశంలోనే అత్యంత ప్రతిస్టాత్మకంగా జరిగిన విషయం తెలిసిందే.
— మంచాల బాబు (@manchalababu03) March 4, 2026