E-Paper
Advertisement

CAA: సీఏఏ అమలు వేగవంతం.. 14 మందికి తొలిసారి భారత పౌరసత్వం!

CAA: సీఏఏ అమలు వేగవంతం.. 14 మందికి  తొలిసారి భారత పౌరసత్వం!
Advertisement

CAA Issued Citizenship Certificates for 14 Members: సీఏఏ అమలులోకి వచ్చిన తర్వాత కేంద్రం తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం పౌర సత్వ సవరణ చట్టం-2019 (CAA) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది.

ఈ నేపథ్యంలోనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఢిల్లీలో సీఏఏ క్రింద జారీ అయిన పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. దేశంలో సీఏఏ అమలు కోసం ఈ ఏడాది మార్చిలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే 2019 డిసెంబర్ లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం పార్టమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది.

Advertisement

సీఏఏ చట్టం ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర తరనార్థుల వద్ద సరైన పత్రాలు లేకపోయినా వారికి భారత పౌరసత్వం ఇచ్చేలా కేంద్రం నిబంధనలు రూపొందించింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్దులు, పార్సీలు, జైనులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. దీని దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్ లైన్ లోనే ముగుస్తుంది.

Also Read: స్వాతి మాలివాల్ పై కుట్ర, ప్రాణాలకు ప్రమాదం: ఆమె మాజీ భర్త నవీన్

Advertisement

Tags

Related News

NEET Protest: ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

Sonam Bail: హనీమూన్​ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితురాలికి కోర్టు రెండు ఆప్షన్లు..?

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

Big Stories

Advertisement
×