BigTV English
Advertisement

Badlapur: రైల్వేట్రాక్‌ల‌పై స్థానికుల భారీ నిరసన.. పరిస్థితి ఉద్రిక్తం

Badlapur: రైల్వేట్రాక్‌ల‌పై స్థానికుల భారీ నిరసన.. పరిస్థితి ఉద్రిక్తం

Badlapur protest news today(Live tv news telugu): మహారాష్ట్రలోని థానెలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. బద్లాపుర్ లోని ఓ పాఠశాలలో నాలుగేళ్ల బాలికలపై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీంతో థానె నగరం పూర్తిగా స్తంభించింది. ఆందోళనకారులు రైల్వేట్రాక్ ల పైకి రావడంతో స్థానిక రైళ్లను నిలిపివేశారు. అయితే, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు స్వీపర్ ను అదుపులోకి తీసుకున్నారు.


Also Read: లేటరల్ ఎంట్రీపై కేంద్రం వెనకడుగు.. ప్రకటనను వెనక్కి తీసుకోవాల్సిందిగా యూపీఎస్సీకి ఆదేశం

బద్లాపుర్ లోని పాఠశాలలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై ఒక స్వీపర్ అనుచితంగా ప్రవర్తించాడు. ఓ బాలిక తమ తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరో బాధిత బాలిక పాఠశాలకు వెళ్లాలంటేనే భయపడింది. దీంతో ఆమెను వైద్యుల వద్దకు తీసుకెళ్లగా వారిపై వేధింపులు జరిగినట్లు తేలింది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, వారి నుంచి మొదట ఎటువంటి స్పందన రాలేదు. చివరకు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా పాఠశాల నిర్వహణలో లొసుగులు కూడా బయటకు వచ్చాయి. బాలికల టాయిలెట్ నిర్వహణకు మహిళలను కేటాయించలేదని వెల్లడైంది. మరోవైపు పాఠశాలలో ఉన్న సీసీ కెమెరాలు కూడా పనిచేయడంలేదని తేలింది.


ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రైల్వే ట్రాక్ లపై ఆందోళనకారులు నిరసన చేస్తుండడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంల స్పందించిన బాలలల హక్కుల జాతీయ కమిషన్. దర్యాప్తు నిమిత్తం బద్లాపుర్ కు ఒక బృందాన్ని పంపేందుకు సిద్ధమయ్యింది.

Also Read: కోల్‌కతా ట్రైనీ హత్యాచార ఘటన.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

పాఠశాల యాజమాన్యం ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర విచారణం వ్యక్తం చేసింది. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసింది. క్లాస్ టీచర్, ఇద్దరు సిబ్బందిని కూడా తొలగించింది పాఠశాల యాజమాన్యం.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×