E-Paper
Advertisement

Hottest Year : అమ్మో.. 1.4 డిగ్రీల వేడి పెరిగిందా!

Hottest Year : అమ్మో.. 1.4 డిగ్రీల వేడి పెరిగిందా!
Advertisement
Hottest Year

Hottest Year : కాలచక్రంలో మరో ఏడాది కరిగిపోతున్న తరుణంలో ఇదో చేదువార్త. అత్యధిక వేడిమి నమోదైన సంవత్సరంగా 2023 మిగిలిపోనుంది. ఈ ఏడాది ప్రపంచం యావత్తు భగభగలాడింది. పారిశ్రామిక విప్లవం ముందు నాటి సగటు కంటే ప్రపంచ ఉష్ణోగ్రతలు దాదాపు 1.4 డిగ్రీల సెల్సియస్ పెరిగాయని వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్(WMO) హెచ్చరించింది.

భూతాపం పెరుగుదలతో దుబాయ్‌లో గురువారం ఆరంభమైన పర్యావరణ సదస్సు కాప్-28కు హాజరైన నేతలపై ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి. బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలంటూ పేద దేశాలు మరోమారు తమ వాణిని గట్టిగా వినిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

గ్రీన్‌హౌస్ వాయువులు, ఉష్ణోగ్రతలు, సముద్ర మట్టాల పెరుగుదలతో పాటు అంటార్కిటిక్ మంచు కరిగిపోతుండటం వంటివి ఇప్పటికీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని డబ్ల్యూఎంవో పేర్కొంది. 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలను(గ్లోబల్ వార్మింగ్) పెరగనివ్వరాదన్నది 2015 పారిస్ ఒప్పందం లక్ష్యం.

ఇప్పటికే దానికి దరిదాపుల్లోకి వచ్చేసినందున.. ఇకనైనా ఉష్ణోగ్రతలు పెరగకుండా కళ్లెం వేయాల్సి ఉంది. గత రెండేళ్లలోనే స్విట్జర్లాండ్‌లో పదిశాతం మేర మంచు కరిగిపోయింది. కెనడాలో కార్చిచ్చు ఫలితంగా అక్కడి అటవీ విస్తీర్ణంలో 5 శాతం మేర బూడిదగా మారిపోయింది. ఈ రెండు పరిణామాలు కొత్తవి, తీవ్ర ఆందోళన కలిగించేవే.

Advertisement

శిలాజ ఇంధనాలను మండించడం వల్లే వాతావరణంలో ఈ విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. అంతిమంగా ఇవి తూర్పు పసిఫిక్ ప్రాంతంలో ఎల్‌నినో పరిస్థితులు నెలకొనడానికి దారితీశాయి. ఈ శీతాకాలంలోనూ ఇది ఇలాగే కొనసాగితే 2024 సంవత్సరం మరింత వేడిమిని చవిచూడాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×