BigTV English
Advertisement

Hottest Year : అమ్మో.. 1.4 డిగ్రీల వేడి పెరిగిందా!

Hottest Year : అమ్మో.. 1.4 డిగ్రీల వేడి పెరిగిందా!
Hottest Year

Hottest Year : కాలచక్రంలో మరో ఏడాది కరిగిపోతున్న తరుణంలో ఇదో చేదువార్త. అత్యధిక వేడిమి నమోదైన సంవత్సరంగా 2023 మిగిలిపోనుంది. ఈ ఏడాది ప్రపంచం యావత్తు భగభగలాడింది. పారిశ్రామిక విప్లవం ముందు నాటి సగటు కంటే ప్రపంచ ఉష్ణోగ్రతలు దాదాపు 1.4 డిగ్రీల సెల్సియస్ పెరిగాయని వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్(WMO) హెచ్చరించింది.


భూతాపం పెరుగుదలతో దుబాయ్‌లో గురువారం ఆరంభమైన పర్యావరణ సదస్సు కాప్-28కు హాజరైన నేతలపై ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి. బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలంటూ పేద దేశాలు మరోమారు తమ వాణిని గట్టిగా వినిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

గ్రీన్‌హౌస్ వాయువులు, ఉష్ణోగ్రతలు, సముద్ర మట్టాల పెరుగుదలతో పాటు అంటార్కిటిక్ మంచు కరిగిపోతుండటం వంటివి ఇప్పటికీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని డబ్ల్యూఎంవో పేర్కొంది. 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలను(గ్లోబల్ వార్మింగ్) పెరగనివ్వరాదన్నది 2015 పారిస్ ఒప్పందం లక్ష్యం.


ఇప్పటికే దానికి దరిదాపుల్లోకి వచ్చేసినందున.. ఇకనైనా ఉష్ణోగ్రతలు పెరగకుండా కళ్లెం వేయాల్సి ఉంది. గత రెండేళ్లలోనే స్విట్జర్లాండ్‌లో పదిశాతం మేర మంచు కరిగిపోయింది. కెనడాలో కార్చిచ్చు ఫలితంగా అక్కడి అటవీ విస్తీర్ణంలో 5 శాతం మేర బూడిదగా మారిపోయింది. ఈ రెండు పరిణామాలు కొత్తవి, తీవ్ర ఆందోళన కలిగించేవే.

శిలాజ ఇంధనాలను మండించడం వల్లే వాతావరణంలో ఈ విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. అంతిమంగా ఇవి తూర్పు పసిఫిక్ ప్రాంతంలో ఎల్‌నినో పరిస్థితులు నెలకొనడానికి దారితీశాయి. ఈ శీతాకాలంలోనూ ఇది ఇలాగే కొనసాగితే 2024 సంవత్సరం మరింత వేడిమిని చవిచూడాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Big Stories

×