BigTV English

Parliament Security Breach: పార్లమెంట్ లో సెక్యూరిటీ వైఫల్యం.. 8 మందిపై వేటు

Parliament Security Breach: పార్లమెంట్ లో సెక్యూరిటీ వైఫల్యం.. 8 మందిపై వేటు

Parliament Security Breach: భారతదేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికైన పార్లమెంట్ లో బుధవారం చెలరేగిన ఓ అలజడి.. యావత్ దేశమంతా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ గురువారం కీలక మంత్రులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, మంత్రులు ప్రహ్లాద్ జోషీ, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.


కాగా.. పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై లోక్ సభ సెక్రటేరియట్ చర్యలు చేపట్టింది. పార్లమెంట్ లో అలజడి చెలరేగిన సమయంలో విధుల్లో ఉన్న 8 మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ ఘటనపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు గురువారం ఆందోళన చేపట్టాయి. లోక్ సభలో భద్రతా వైఫల్యంపై చర్చచేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో కొంతసేపు సభంతా ఆందోళనలు సాగాయి. విపక్షాల ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో స్పీకర్ వారిని వారించారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకూ లోక్ సభ వాయిదా పడింది.

బుధవారం పార్లమెంట్ లో జరిగిన ఘటన నేపథ్యంలో.. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మకరద్వారం నుంచి కేవలం ఎంపీలను మాత్రమే లోపలికి అనుమతించారు. మీడియాను కొద్దిమీటర్ల దూరంలోనే ఆపివేశారు. పార్లమెంట్ కు వచ్చే ప్రతి ఒక్కరి బూట్లను కూడా గురువారం స్కాన్ చేశారు.


Related News

UP News: విద్యా అధికారిపై కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Big Stories

×