BigTV English
Advertisement

Heart Attack: గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. పాఠశాల ప్రాంగణంలోనే

Heart Attack: గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. పాఠశాల ప్రాంగణంలోనే

Heart Attack: ఇప్పుడున్న రోజుల్లో ఎప్పుడు ఏంజరుగుతుందో అర్ధంకానీ పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు.. తిరిగి వస్తారన్న నమ్మకం రోజురోజుకి తగ్గిపోతుంది. కాలక్రమేణా వెళ్తున్న మార్గంలో రోడ్డు యాక్సిడెంట్ అయ్యి అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ రావడం కామన్ అయిపోయింది. తాజాగా ఎనిమిదేళ్ల బాలిక పాఠశాల ప్రాంగణంలోనే గుండెపోటుతో మరణించింది.


వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్‌లోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ స్కూల్‌లో గార్గి అనే విద్యార్ధిని మూడవ తరగతి చదువుతుంది. రోజూవారిలాగే స్కూల్‌కి వచ్చిన బాలిక.. పాఠశాలకు రావడంతోనే ఛాతి నొప్పి అంటూ టీచర్స్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే రిషప్షన్ దగ్గర కుర్చీలో కూర్చున్న గార్గి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది గమనించిన పాఠశాల యాజమాన్యం బాలికను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గార్గి గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిజానికి బాలిక అవస్థకు గురై.. ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు.. సీసీ కెమరాలో రికార్డయిన వీడియోలో చూడవచ్చు. ఇక గార్గి సాధారణ వ్యాధులకు మించి పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమి లేవని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×